Jharkhand: రీల్స్ పిచ్చి పీక్స్కు.. 100 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకి..!
సరదాగా రీల్స్ చేసేందుకు ఓ యువకుడు 100 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు వెర్రి చేష్టలు చేస్తుంటారు. రీల్స్ మోజులో పడి ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనే స్పృహను మరిచి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలా ఓ యువకుడు రీల్స్ కోసం ఎత్తైన ప్రదేశం నుంచి చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు స్నానం చేసేందుకు తన స్నేహితులతో కలిసి సమీపంలోని క్వారీలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రీల్స్ చేయాలని నిర్ణయించుకొన్నాడు. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి చెరువులోకి దూకాడు. గాయపడిన అతడు సెకన్ల వ్యవధిలోనే మునిగిపోయాడు.
ప్రమాదానికి ముందు.. బార్లో 90 నిమిషాల్లో 48వేలు ఖర్చు చేసి..!
సమీపంలోని వారు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక బృందం అతడి మృతదేహాన్ని వెలికి తీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
అభం శుభం ఎరుగని ఆ చిన్నారికి ఏం తెలుసు.. కొన్ని గంటల్లో ఓ కామాంధుడు వస్తాడని? అతడి దురాగతానికి దారుణంగా బలైపోతానని.. ఎప్పటిలాగే అమ్మ పక్కన ఆదమరిచి నిద్రించింది ఆ బుజ్జాయి. అర్ధరాత్రివేళ.. మానవరూపంలో ఉన్న ఓ పశువు ఆమెను ఎత్తుకెళ్లి హత్యాచారానికి ఒడిగట్టాడు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
అంతా చూస్తుండగానే అంతమొందించారు
భూతగాదాలు యువకుడిని బలిదీసుకున్నాయి. అందరూ చూస్తుండగానే దాయాదులు కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి, అతని ప్రాణం తీశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
అటవీ అధికారులపై మూకుమ్మడి దాడి
అటవీ ప్లాంటేషన్ భూముల్లో సాగుకు సిద్ధపడుతున్నారన్న సమాచారం మేరకు అడ్డుకునేందుకు సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్వోపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మధ్యప్రదేశ్లో ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు భక్తుల మృతి
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో భక్తులను తీసుకెళ్తోన్న ఓ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. మైథనా పాలి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీల దుర్మరణం
ఝార్ఖండ్లోని గడ్వా జిల్లాలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగర్ ఉంటారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. -
రైల్లో మంటలంటూ వదంతులు.. భయంతో దూకేసిన ముగ్గురి మృతి
తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి దాన్నుంచి దూకేసిన ప్రయాణికులు ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం ఝార్ఖండ్లో చోటు చేసుకుంది. -
అదుపు తప్పి లారీ బోల్తా.. ఇద్దరు ఉద్యోగుల మృతి
లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో విధులకు వెళ్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్, ఒప్పంద ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది.