Pune Car Crash: ప్రమాదానికి ముందు.. బార్లో 90 నిమిషాల్లో 48వేలు ఖర్చు చేసి..!
Pune Car Crash: ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరు మృతి చెందిన ఘటనలో నిందితుడైన ఆ మైనర్ మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు కూడా అతడు బార్లో కేవలం 90 నిమిషాల్లో రూ.48వేలు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
పుణె: మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు (Pune car Crash)లో నిందితుడైన టీనేజర్ గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత వెళ్లిన బార్లో నిందితుడు కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అక్కడి నుంచి మరో బార్కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు టెకీలు (IT professionals) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా.. ఘటన (Car Accident) నేపథ్యంలో ఆ టీనేజర్కు డ్రైవింగ్ లైసెన్సుపై నిషేధం విధిస్తున్నట్లు మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వివేక్ భిమన్వార్ వెల్లడించారు. అతడికి 25 ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
కార్లు మార్చి.. పారిపోయేందుకు ప్రయత్నించి..
ఈ కేసులో టీనేజర్ తండ్రి పుణెలో పేరున్న ఓ రియల్టర్. ప్రమాదం గురించి తెలియగానే తనను అరెస్టు చేస్తారని ఊహించిన ఆ వ్యాపారవేత్త పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక కారులో ముంబయి బయల్దేరి.. తనకు చెందిన మరో కారును డ్రైవర్తో గోవాకు పంపించాడు. మధ్యలో స్నేహితుల నుంచి కార్లు తెప్పించుకుని అందులోకి మారాడు. నంబరు ట్రాక్ చేయకుండా కొత్త సిమ్ ఉపయోగించాడు. అయితే, స్నేహితుడి కారులో ఉన్న జీపీఎస్ ట్రాకర్తో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు.
మరోవైపు, ఈ కేసులో కీలక నిందితుడైన ఆ మైనర్కు 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అతడి బెయిల్ను రద్దు చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, అతడిని మేజర్గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతినివ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాహనదారులకు కర్ణాటక భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలపై వాత
Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. -
పేపర్ లీక్కు రూ.30 లక్షలు: ‘నీట్’ దర్యాప్తులో సంచలనాలు..!
NEET paper Leak: నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు కొంతమంది అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిసింది. బిహార్లో చేపట్టిన దర్యాప్తు వల్ల ఈ సంచలన విషయాలు బయటపడినట్లు సమాచారం. -
మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు నిర్వహించిన నియోజకవర్గాల్లో మహా వికాస్ అఘాడీ విజయం సాధించిందని ఎన్సీపీ (ఎస్సీపీ) నేత శరద్ పవార్ అన్నారు. -
‘ఇందిరాగాంధీ మదర్ ఆఫ్ ఇండియా’.. కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వ్యాఖ్యలు
Suresh Gopi: భాజపా ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. -
లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి
23 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. -
దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్ నేత ఆతిశీ
దేశ రాజధాని తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటుందని, హరియాణా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నీరు విడుదల చేయాలని దిల్లీ మంత్రి ఆతిశీ కోరారు. -
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు
PM Kisan 17th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్. జూన్ 18వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణపనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..8మంది నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. -
‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్కు దిల్లీ కోర్టు నోటీసులు
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో విషయంలో సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal)కు దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. -
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ సీనియర్ల నుంచి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి వివాదాస్పదం కావడంతో తాజాగా వివరణ వచ్చింది. -
అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
బుల్లెట్ రైలులో ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ
బుల్లెట్ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్ఫాల్ మానిటరింగ్ సిస్టమ్)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. -
శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు
యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. -
త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. -
భాజపాతో ఆరెస్సెస్కు విభేదాల్లేవు.. సంఘ్ వర్గాల వెల్లడి
భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. -
అమెరికాలో వర్క్ పర్మిట్దారుల పిల్లలను ఆదుకోండి
అమెరికాకు వర్క్పర్మిట్పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు. -
యడియూరప్పకు కోర్టులో ఊరట
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను అరెస్టు చేయవద్దని సదాశివనగర పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. -
నీట్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేంద్ర మంత్రి సోమణ్ణ కుమారుడిపై కేసు
రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ కుమారుడు అరుణ్, ఆయన సహచరుడు ప్రమోద్రావుపై బెంగళూరు సంజయనగర ఠాణాలో కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి
-
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కార్యకర్తల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
-
కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా!: శివరాం
-
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
-
వాహనదారులకు కర్ణాటక భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలపై వాత
-
రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ