Kothagudem: ఎఫ్‌ఆర్వో హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు

ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

Updated : 03 Aug 2023 12:28 IST

కొత్తగూడెం పట్టణం: ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మడకం తుల, మిడియం నంగాలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. గతేడాది చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు నరుకుతుండగా అడ్డుకున్న ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావును అదే గ్రామానికి తుల, నంగాలు వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని