Scam Alert: భారీ రాబడులంటూ కోటికి పైగా కొట్టేశారు.. వెలుగులోకి ఫేక్ స్టాక్ మార్కెట్ స్కామ్!
Scam Alert: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో పెద్ద మొత్తంలో స్థిరమైన ఆదాయం అంటూ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడిన ఉదంతం ఇదీ..
Scam Alert | ఇంటర్నెట్డెస్క్: పెట్టుబడులపై అత్యధిక రాబడి కోసం అందరూ చూస్తుంటారు. అందుకోసం వివిధ పెట్టుబడి సాధనాలను పరిశీలిస్తారు. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. మార్కెట్ గురించి తెలీని వారు సైతం ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. భారీ ఆదాయం వస్తుందంటూ ఓ వ్యక్తికి ఎరవేశారు. ఫేక్ స్టాక్ మార్కెట్ను సృష్టించి రూ.కోటిన్నర కొట్టేశారు.
అమిత్ కిషోర్(42) అనే వ్యక్తి లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు ఆర్జించొచ్చని ఆయన్ని కొందరు వ్యక్తులు నమ్మించారు. మాయమాటలు చెప్పి తొమ్మిది మంది ఉన్న ఓ వాట్సప్ గ్రూప్లో అతడిని యాడ్ చేశారు. పెట్టుబడి సలహాల పేరుతో డబ్బులు పెట్టించారు. పెట్టుబడిపై భారీ ప్రతిఫలం కూడా కనిపించడం మొదలైంది. ఆ సొమ్ము విత్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే అసలు రంగు బయటపడింది. అవన్నీ కేవలం ఫేక్ విజువల్స్ అని! అతడి ట్రేడింగ్ వాలెట్ను స్కామర్లు నిలుపుదల చేశారు.
డబ్బు కోసం బాలుడి కిడ్నాప్.. చంపేసి గోనె సంచిలో కుక్కిన వైనం
భారీగా పెట్టుబడులు పెట్టించడమే కాకుండా.. అమిత్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మరో పన్నాగానికి తెరలేపారు. పెట్టుబడి పెట్టకపోతే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని బెదిరించారు. బాధితుడిపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద మొత్తంలో జరిమానాలంటూ ఫేక్ లీగల్ నోటీసులూ పంపారు. అలా ఏకంగా రూ.1.4 కోట్లు అతడి చేత ఇన్వెస్ట్ చేయించారు. చివరికి తాను మోసపోయాననే విషయం తెలుసుకున్న కిషోర్.. లుథియానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన 9 మందిని గుర్తించారు. వీరిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆకర్షణీయమైన రాబడులు ఎవరైనా పెట్టుబడులు గురించి చెబుతూ ఉంటే వాటి గురించి ఆరా తీయాలని, పూర్తిగా పరిశీలించాకే ముందడుగు వేయాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్