Scam Alert: భారీ రాబడులంటూ కోటికి పైగా కొట్టేశారు.. వెలుగులోకి ఫేక్ స్టాక్ మార్కెట్ స్కామ్!
Scam Alert: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో పెద్ద మొత్తంలో స్థిరమైన ఆదాయం అంటూ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడిన ఉదంతం ఇదీ..
Scam Alert | ఇంటర్నెట్డెస్క్: పెట్టుబడులపై అత్యధిక రాబడి కోసం అందరూ చూస్తుంటారు. అందుకోసం వివిధ పెట్టుబడి సాధనాలను పరిశీలిస్తారు. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. మార్కెట్ గురించి తెలీని వారు సైతం ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. భారీ ఆదాయం వస్తుందంటూ ఓ వ్యక్తికి ఎరవేశారు. ఫేక్ స్టాక్ మార్కెట్ను సృష్టించి రూ.కోటిన్నర కొట్టేశారు.
అమిత్ కిషోర్(42) అనే వ్యక్తి లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు ఆర్జించొచ్చని ఆయన్ని కొందరు వ్యక్తులు నమ్మించారు. మాయమాటలు చెప్పి తొమ్మిది మంది ఉన్న ఓ వాట్సప్ గ్రూప్లో అతడిని యాడ్ చేశారు. పెట్టుబడి సలహాల పేరుతో డబ్బులు పెట్టించారు. పెట్టుబడిపై భారీ ప్రతిఫలం కూడా కనిపించడం మొదలైంది. ఆ సొమ్ము విత్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే అసలు రంగు బయటపడింది. అవన్నీ కేవలం ఫేక్ విజువల్స్ అని! అతడి ట్రేడింగ్ వాలెట్ను స్కామర్లు నిలుపుదల చేశారు.
డబ్బు కోసం బాలుడి కిడ్నాప్.. చంపేసి గోనె సంచిలో కుక్కిన వైనం
భారీగా పెట్టుబడులు పెట్టించడమే కాకుండా.. అమిత్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మరో పన్నాగానికి తెరలేపారు. పెట్టుబడి పెట్టకపోతే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని బెదిరించారు. బాధితుడిపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద మొత్తంలో జరిమానాలంటూ ఫేక్ లీగల్ నోటీసులూ పంపారు. అలా ఏకంగా రూ.1.4 కోట్లు అతడి చేత ఇన్వెస్ట్ చేయించారు. చివరికి తాను మోసపోయాననే విషయం తెలుసుకున్న కిషోర్.. లుథియానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన 9 మందిని గుర్తించారు. వీరిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆకర్షణీయమైన రాబడులు ఎవరైనా పెట్టుబడులు గురించి చెబుతూ ఉంటే వాటి గురించి ఆరా తీయాలని, పూర్తిగా పరిశీలించాకే ముందడుగు వేయాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్