Madhya Pradesh: స్వరం మార్చే యాప్తో మభ్యపెట్టి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం
ఉపకార వేతనాల పేరుతో పేద విద్యార్థినులను మభ్యపెట్టి ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడిన బ్రజేశ్ ప్రజాపతి (30) అనే ప్రధాన నిందితుడితోపాటు అతడి సహాయకులైన మరో ముగ్గురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్లో నిందితులను అరెస్టు చేసిన ‘సిట్’
సీధీ (మధ్యప్రదేశ్): ఉపకార వేతనాల పేరుతో పేద విద్యార్థినులను మభ్యపెట్టి ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడిన బ్రజేశ్ ప్రజాపతి (30) అనే ప్రధాన నిందితుడితోపాటు అతడి సహాయకులైన మరో ముగ్గురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సీధీ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల్లో ఎక్కువమంది గిరిజన తెగలకు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలతో ఏర్పడిన ‘సిట్’ ఈ కేసును దర్యాప్తు చేసింది. సెల్ఫోన్లలో అమర్చుకునే స్వరం మార్పు యాప్ సాయంతో ప్రజాపతి యువతులకు ఫోను చేసేవాడు. టికరీ కళాశాల మహిళా టీచరుగా పరిచయం చేసుకొని, తనను కలిస్తే ఉపకార వేతనం ఇప్పించే ఏర్పాటు చేస్తానని నమ్మబలికేవాడు. ‘‘నా కుమారుడు వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాడు’’ అని మహిళ స్వరంతో చెప్పే ప్రజాపతి.. ఆ తర్వాత చేతికి తొడుగులు, తలకు హెల్మెట్ ధరించి తనే ద్విచక్ర వాహనంతో వెళ్లేవాడు. నమ్మి వచ్చిన యువతులను నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసేవాడు.
ఆ తర్వాత బాధితుల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకునేవాడు. బాధితుల్లో నలుగురు యువతులు ముందుకువచ్చి ఫిర్యాదు చేయడంతో చేతులపై కాలిన గాయాల గుర్తులున్న ప్రధాన నిందితుణ్ని, అతడి సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు విద్యార్థినులను ఇలా మోసగించినట్లు ప్రజపతి విచారణలో వెల్లడించాడు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజాపతికి సహకరించిన మరో ముగ్గురు నిందితుల్లో ఒకరు కళాశాల విద్యార్థి అని, వాట్సప్ గ్రూపు నుంచి యువతుల ఫోన్ నంబర్లు సేకరించి ఇచ్చేవాడని రేవా రేంజి ఐజీ మహేంద్రసింగ్ సికర్వార్ శనివారం వివరాలు వెల్లడించారు. ఈ ముగ్గురి పాత్రపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు బ్రజేశ్ ప్రజాపతి అరెస్టు అనంతరం.. అనధికారికంగా కట్టిన అతడి ఇంటిని అధికారులు కూల్చివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్