Madhya Pradesh: స్వరం మార్చే యాప్తో మభ్యపెట్టి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం
ఉపకార వేతనాల పేరుతో పేద విద్యార్థినులను మభ్యపెట్టి ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడిన బ్రజేశ్ ప్రజాపతి (30) అనే ప్రధాన నిందితుడితోపాటు అతడి సహాయకులైన మరో ముగ్గురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్లో నిందితులను అరెస్టు చేసిన ‘సిట్’
సీధీ (మధ్యప్రదేశ్): ఉపకార వేతనాల పేరుతో పేద విద్యార్థినులను మభ్యపెట్టి ఏడుగురు యువతులపై అత్యాచారానికి పాల్పడిన బ్రజేశ్ ప్రజాపతి (30) అనే ప్రధాన నిందితుడితోపాటు అతడి సహాయకులైన మరో ముగ్గురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సీధీ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల్లో ఎక్కువమంది గిరిజన తెగలకు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలతో ఏర్పడిన ‘సిట్’ ఈ కేసును దర్యాప్తు చేసింది. సెల్ఫోన్లలో అమర్చుకునే స్వరం మార్పు యాప్ సాయంతో ప్రజాపతి యువతులకు ఫోను చేసేవాడు. టికరీ కళాశాల మహిళా టీచరుగా పరిచయం చేసుకొని, తనను కలిస్తే ఉపకార వేతనం ఇప్పించే ఏర్పాటు చేస్తానని నమ్మబలికేవాడు. ‘‘నా కుమారుడు వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాడు’’ అని మహిళ స్వరంతో చెప్పే ప్రజాపతి.. ఆ తర్వాత చేతికి తొడుగులు, తలకు హెల్మెట్ ధరించి తనే ద్విచక్ర వాహనంతో వెళ్లేవాడు. నమ్మి వచ్చిన యువతులను నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసేవాడు.
ఆ తర్వాత బాధితుల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకునేవాడు. బాధితుల్లో నలుగురు యువతులు ముందుకువచ్చి ఫిర్యాదు చేయడంతో చేతులపై కాలిన గాయాల గుర్తులున్న ప్రధాన నిందితుణ్ని, అతడి సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు విద్యార్థినులను ఇలా మోసగించినట్లు ప్రజపతి విచారణలో వెల్లడించాడు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజాపతికి సహకరించిన మరో ముగ్గురు నిందితుల్లో ఒకరు కళాశాల విద్యార్థి అని, వాట్సప్ గ్రూపు నుంచి యువతుల ఫోన్ నంబర్లు సేకరించి ఇచ్చేవాడని రేవా రేంజి ఐజీ మహేంద్రసింగ్ సికర్వార్ శనివారం వివరాలు వెల్లడించారు. ఈ ముగ్గురి పాత్రపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు బ్రజేశ్ ప్రజాపతి అరెస్టు అనంతరం.. అనధికారికంగా కట్టిన అతడి ఇంటిని అధికారులు కూల్చివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏనుగు దాడిలో వృద్ధుడి దుర్మరణం.. చిత్తూరు జిల్లాలో ఘటన
ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీయం తండాలో చోటుచేసుకుంది. కుప్పం ఎఫ్ఆర్వో జయశంకర్ వివరాల మేరకు.. తండాకు చెందిన కన్నానాయక్(65) శనివారం రాత్రి పశువులను కట్టేసేందుకు కొట్టంలోకి వెళ్లారు. -
హత్యకు దారి తీసిన ఘర్షణ
అప్పు చెల్లించే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పడాల గ్రామం విజయదుర్గ ఆలయం పక్క రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కొప్పర్తి రాంబాబు -
ఫైనాన్స్ వాహనాలే లక్ష్యంగా మోసాలు
-
ఘర్షణ ఘటనలో 14 మంది అరెస్టు
గోవుల రవాణా నేపథ్యంలో శనివారం రాత్రి మెదక్లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనను నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్కు ఓ వర్గం పిలుపునిచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బెదిరించి రాజీనామాలు చేయించారు.. వైకాపా నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు
-
జగన్ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
-
‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ!
-
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
-
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’