Crime: పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద పోలవరం పునరావాస బాధితుడొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Published : 24 May 2024 18:03 IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద పోలవరం పునరావాస బాధితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన అక్కడి సిబ్బంది అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. బాధిత రైతును దేవీపట్నంకు చెందిన ఉండమట్ల సీతారామయ్య(75)గా గుర్తించారు. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తనకు పరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇవ్వలేదని విసుగు చెందిన బాధితుడు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని