Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం ఆందోళనలకు దారితీసింది. వైకాపా నాయకులు ఇటీవల పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరికొందరు మోస్తున్నట్లు కార్టూన్ ఉండటం అభ్యంతరకరంగా ఉందని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మే 26న కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు.