Pune car Crash: ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
Pune car Crash: బాలుడి డ్రైవింగ్తో ఇద్దరు మృతి చెందిన ఘటన రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి.
దిల్లీ: ఒక మైనర్ దురుసు డ్రైవింగ్ రెండు కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన అనీశ్, అశ్విని మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను చూసి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఇది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
‘‘ఇప్పుడు మా కుటుంబం అంతా షాక్లో ఉంది. ఘటన జరిగిన 15 గంటల్లో బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్ షరతులు తీవ్రంగా బాధించాయి. మేం న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం. అతడి తల్లిదండ్రులను విచారించాలి. వెంటనే నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా జీవితమే చూడని అమాయకురాలిని పొట్టనపెట్టుకున్నాడు’’ అని అశ్విని బంధువు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్లో అనీశ్ నిర్జీవంగా కనిపించడంతో.. అతడి కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.‘‘ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయంలో నిందితుడికి బెయిల్ ఇవ్వడం దారుణం. అతడికి కఠిన శిక్ష పడాలి’’ అని అనీశ్ తాతయ్య వాపోయారు.
ఆమెను నమ్మి.. వందల కోట్లు మోసపోయారు!
పుణెలో ఆదివారం తెల్లవారుజామున ఓ బైక్ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవ్ చేసిన నిందితుడు ఓ మైనర్ అని గుర్తించిన పోలీసులు.. అతడిని కోర్టు ముందు హాజరుపర్చారు. ఆ బాలుడికి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలంటూ విధించిన బెయిల్ షరతులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. నిందితుడిని మేజర్గా పరిగణించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు సెషన్ కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు.
మైనర్ తండ్రి అరెస్టు..
మహారాష్ట్రలో ఔరంగాబాద్లో మైనర్ తండ్రిని పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వయసు నిబంధనను మరిచి నిందితుడికి ఆల్కహాల్ సరఫరా చేసిన రెండు బార్స్ యజమానుల్ని కూడా అరెస్టు చేశారు. 12వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత వేడుక చేసుకోవడానికి తన స్నేహితులతో కలిసి బార్కు వెళ్లాడు. అక్కడ మద్యం సేవించి, తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఆ కారుకు ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు