Crime News: ప్రియుడిపై సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించిందని.. కన్న కుమార్తె హత్య!

ఓ కేసులో ప్రియుడిపై సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించిన యువతిని ఆమె తల్లిదండ్రులు హత్య చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

Published : 27 Aug 2023 16:20 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. కోర్టులో ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో కన్న కుమార్తెను హత్యచేశారు ఆమె తల్లిదండ్రులు (Pregnant woman killed). ఎనిమిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేసి, మృతదేహాన్ని నదిలో పారేయడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి ముజఫర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి (19) గతేడాది తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. డిసెంబరులో పోలీసులు వారి ఆచూకీ కనుగొన్నారు.

బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి!

యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై కిడ్నాప్‌, అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ కేసులో శనివారం ఆ యువతి కోర్టులో తన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా రాలేదు. ఈ క్రమంలో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ‘కోర్టులో ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఆమె తల్లిదండ్రులు కోరారు. కానీ, ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెను హత్య చేశారు’ అని ఎస్పీ తెలిపారు. విచారణ క్రమంలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని