Crime news: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 05 Jan 2024 22:27 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ఆటో, ద్విచక్రవాహనాన్ని మినీలారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలనగర్‌లో జరిగే వారపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు సవియాతండాకు చెందిన జున్ను (3), మోతీఘన్‌పూర్‌కు చెందిన పింకి(8), సునీత(32), రాజాపూర్‌కు చెందిన పన్నీ(50) బాలానగర్‌కు చెందిన జశ్వంత్‌(10)గా గుర్తించారు.

ప్రమాదం జరిగిన బాలానగర్‌ చౌరస్తాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రమాదానికి కారణమైన మినీలారీకి ఆందోళనకారులు నిప్పంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్చర్ల రూరల్‌ సీఐ, బాలానగర్‌ ఎస్‌ఐలను ఆందోళనకారులు దుకాణంలో నిర్బంధించారు. సంత జరిగే రోజు ట్రాఫిక్‌ నిర్వహణ సరిగా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్-బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. బాలానగర్‌ చౌరస్తాకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని