Hyderabad: పాల ప్యాకెట్‌ కోసం కుమారుడితో వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పాల ప్యాకెట్‌ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్‌-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది.

Updated : 30 May 2024 11:04 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: పాల ప్యాకెట్‌ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్‌-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్‌ (35)గా గుర్తించారు. జీవనోపాధి కోసం పది రోజుల క్రితమే ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి వచ్చింది. గురువారం ఉదయం కనక ప్రసాద్‌ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్‌ తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై అతడి బైక్‌ను విజయవాడ వైపు నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ప్రసాద్‌ మృతిచెందారు. బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని