Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఏడుగురి మృతి

హరియాణాలోని అంబాలాలో దిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 24 May 2024 10:48 IST

చండీగఢ్‌: హరియాణాలోని అంబాలాలో దిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సును ట్రక్కు ఢీకొన్న ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. యూపీ నుంచి జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని