Siddipet: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Published : 28 Feb 2024 21:13 IST

నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. అనంతరం రెండు వాహనాలు పక్కనే ఉన్న చిన్న కల్వర్టులోకి దూసుకెళ్లాయి. ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరితో పాటు కారులోని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 8 మందికి గాయాలు కాగా.. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని రాజగోపాల్ పేట పోలీసులు పరిశీలించారు. మృతులను రవి (55), ఆయన వియ్యంకుడు ఐలయ్య (55), మమత (28)గా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని