Crime News: ఏఐ సాంకేతికతతో విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్‌

Eenadu icon
By Crime News Desk Updated : 28 Oct 2025 05:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వేధింపులకు పాల్పడిన పాఠశాల అటెండర్‌ 

గంగాధర, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఒక పాఠశాలలో పలువురు బాలికలను అటెండర్‌ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం... పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాల ఫొటోలను చిత్రీకరించిన అటెండర్‌ యాకుబ్‌పాషా కొన్ని రోజుల కిందట ఏఐ సాంకేతికతతో విద్యార్థినుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా మార్చాడు. వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఆరుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలికలు బయటకు చెప్పుకోలేదు. బాలురకు తెలిసి అటెండర్‌తో గొడవకు దిగారు. అనంతరం ఉపాధ్యాయులకు సమస్యను చెప్పినా పట్టించుకోలేదు.

విషయం తెలుసుకున్న స్థానికులు ఈ నెల 24న ఎంపీడీవో రాము దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో ప్రభాకర్‌రావుతో చర్చించిన ఎంపీడీవో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లడంతో సఖి కేంద్రం అధికారులను అదేరోజు పాఠశాలకు పంపించారు. కరీంనగర్‌ గ్రామీణ ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై వంశీకృష్ణ, స్త్రీశిశు సంక్షేమ అధికారిణి సరస్వతి, బాలిక సంక్షేమ అధికారిణి కృపారాణి పాఠశాలలో సోమవారం విచారణ జరిపారు. అటెండర్‌ దుశ్చర్య నిజమేనని విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడిని విధులనుంచి తొలగించారు. ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదుతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బందిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. 

విచారణ జరిపించాలి: కేంద్ర మంత్రి సంజయ్‌ 

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రూరల్‌ ఏసీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, నిందితుడి వద్ద ఉన్న ఫొటోలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. విద్యార్థినుల తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :
Published : 28 Oct 2025 05:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు