Ganja trafficking Gang: 208 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
విజయనగరం నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: విజయనగరం నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 208 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో కలిసి టీఎస్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను టీఎస్ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు.
మేక పోయిందని.. మానవత్వం మరచి..
నిందితులు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో 50వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ‘‘ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నాం. విజయనగరం నుంచి జడ్చర్ల మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి తరలించే లారీకి 30కి.మీ ముందు కారు వెళ్తుంటుంది. ఎక్కడైనా పోలీస్ చెకింగ్ ఉందా? లేదా? చెక్ చేస్తూ వెళ్తారు. రూ.కోటి విలువైన గంజాయిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నాం. నిందితులంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించాం. ప్రధాన నిందితుడు హసన్ పరారీలో ఉన్నాడు’’ అని ఎస్పీ సునీత తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. -
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.