Rev Party: రేవ్ పార్టీలో ఆ తెలుగు నటి పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి ఉన్నట్లు కమిషనర్ దయానంద్ చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది. నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు నటి పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. ఆ నటి సోమవారం విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. 'సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ' పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో దాదాపు వంద మంది పాల్గొన్నట్లు చెప్పారు. మొత్తంగా అందరి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారని తెలిపారు. ఇందులో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొనలేదని చెప్పిన ఆయన.. ఈ వ్యవహారంలో మొత్తంగా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర స్పందించారు. ‘‘రేవ్ పార్టీలో కోట్ల రూపాయల విలువైన కొకైన్, గంజాయి స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని చేసే ప్రయత్నాలు ఇతర రాష్ట్రాల డ్రగ్స్ పెడ్లర్ల వల్ల విఫలమవుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తాం’’ అని తెలిపారు.
బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో తాను లేనని తెలుపుతూ నటి ఒకరు సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని.. తనపై వస్తోన్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఆమె ఆ పార్టీలో పాల్గొన్నట్లు కమిషనర్ చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి