Bhimavaram: భీమవరంలో దారుణం.. ఏడో తరగతి బాలికపై హత్యాచారం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లి అదృశ్యమైన బాలిక ఇంటి సమీపంలోని పొదల్లో శవమై కనిపించింది.

Updated : 28 Sep 2023 17:36 IST

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అదృశ్యమైన బాలిక ఇంటి సమీపంలోని పొదల్లో శవమై కనిపించింది. పోలీసుల కథనం ప్రకారం... భీమవరంలోని ఓ కాలనీలో ఏడో తరగతి విద్యార్థిని నిన్న సాయంత్రం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. సమీపంలో గాలించినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు భీమవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం వారి ఇంటి సమీపంలోని పొదల్లో బాలిక మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

అత్యాచారం చేసి ఆపై హత్య?

బాలిక బంధువు ఒకరు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికకు చిన్నాన్న వరసయ్యే వ్యక్తి భార్య కువైట్‌లో ఉంటోంది. వారి పిల్లలు నరసాపురంలోని ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నిందితుడు..నిన్న సాయంత్రం బాలిక పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. బాలిక దుస్తులు నిందితుడి ఇంటి వద్ద లభించడం, మృతదేహంపై గాయాలుండటంతో అత్యాచారం చేసి హతమార్చినట్టు భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని