Hyderabad: ఆదిభట్లలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 23 Feb 2024 21:11 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు.. టీసీఎస్‌లో సిస్టమ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సత్తి నాగచంద్ర ప్రకాష్‌ (24)గా గుర్తించారు. అతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వేములపల్లి. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు