Crime: చదివింది ఐదే.. ముఠా సాయంతో 500 కార్ల తస్కరణ!
ఉత్తర్ప్రదేశ్లో ఓ ముఠా ఏకంగా 500 కార్లు దొంగిలించడం గమనార్హం.
లఖ్నవూ: చదివింది ఐదో తరగతి వరకే. కానీ.. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఏకంగా 500 వరకు కార్లను తస్కరించాడో వ్యక్తి. ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. తాజ్ మహమ్మద్ అనే వ్యక్తి ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. 2012లో అతడికి రౌణక్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి కార్ల చోరీ మొదలుపెట్టారు. అక్కడి నుంచి ముఠాను విస్తరించి.. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో దాదాపు 500 వరకు కార్లను ఎత్తుకెళ్లారు. ఉత్తర్ప్రదేశ్ పోలీసులు గాజియాబాద్లో తాజ్ మహమ్మద్ సహా నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. వివరాలు బయటకువచ్చాయి. ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
నిరక్షరాస్యులే అయినప్పటికీ వారు యూట్యూబ్ నుంచి కార్లను ఎలా తస్కరించాలో నేర్చుకున్నారు. తొలుత రెక్కీ నిర్వహించేవారు. డిమాండ్ మేరకు సంబంధిత కారును ఎంచుకుని.. వెంట తెచ్చుకున్న ఉపకరణాలు, టాబ్లెట్లో డౌన్లోడ్ చేసిన హైటెక్ సాఫ్ట్వేర్ల సాయంతో అన్లాక్ చేసి ఎత్తుకెళ్లేవారు. విలాసవంత కార్లను ప్రధానంగా లక్ష్యంగా చేసుకునేవారని పోలీసులు తెలిపారు. దొంగిలించిన కార్లలో 200 వరకు వాహనాలను సంభాల్ జిల్లాలోని ఆమీర్కు, మరికొన్నింటిని గుజరాత్ వడోదరలోని మరో వ్యక్తికి విక్రయించారు. నిందితుల్లో కొంతమంది ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లివచ్చారు.
నకిలీ ఐడీతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోకి.. వ్యక్తి అరెస్ట్
అమీర్, అతడి భార్య కూడా ఈ నేరాల్లో భాగస్వాములని.. కార్లను దొంగిలించడానికి వారు ముఠా సభ్యులకు సామగ్రి, రిమోట్ కంట్రోల్డ్ తాళాలను సరఫరా చేశారని పోలీసులు చెప్పారు. ఈ ముఠాకు దుబాయ్తోనూ సంబంధాలు ఉన్నాయి. లగ్జరీ కార్ల తాళాల కోసం తరచూ అక్కడికి వెళ్లేవారు. వాహనాన్ని విక్రయించగా.. వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకునేవారు. విలాసవంత జీవనం కోసం ఈ దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. దిల్లీలోని రోహిణిలో ఓ ఏటీఎం నుంచి రూ.19.9 లక్షలనూ ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు