TDP: సింగరాయకొండలో తెదేపా నాయకుడి కారుకు నిప్పు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాలెంలో తెదేపా నాయకుడి కారును గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు.

Updated : 25 May 2024 11:49 IST

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాలెంలో తెదేపా నాయకుడి కారును గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చిగురుపాటి శేషగిరి తన ఇంటి వద్ద పార్క్ చేసిన కారును శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టాడ్డు. తెదేపా నేత అయిన శేషగిరి.. లారీ యజమానుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయనకున్న ఖాళీ ప్రదేశంలో ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. వ్యాపార లావాదేవీల కారణంగా ఎవరైనా కక్షకట్టి కారు దహనం చేశారా? లేదా దీని వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కొండపి ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి ఎస్పీకి ఫోన్ చేసి రాజకీయ కోణంలో కూడా దర్యాప్తు నిర్వహించాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని