Tirumala: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తిరుమలలోని స్థానిక ఆర్బీసీ సెంటర్కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు.
తిరుమల: తిరుమలలోని స్థానిక ఆర్బీసీ సెంటర్కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. తిరుమల టూటౌన్ ఎస్సై సాయినాథ్ చౌదరి తెలిపిన వివరాల మేరకు.. తిరుమలకు చెందిన ఎస్ కృష్ణ తనయుడు చంద్రశేఖర్(13), యోగేశ్ కుమారుడు వైభవ్ యోగేశ్(13), శ్రీవరదన్(13) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ముగ్గరు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం పుస్తకాలు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్తామని పాఠశాలలో చెప్పారు. ఇంటికి వచ్చి ల్యాప్టాప్ తీసుకొని బస్సెక్కి తిరుపతి ఏడుకొండల బస్టాండ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్