NTR district: మున్నేరు వాగులో ఈతకు దిగి.. ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

మున్నేరు వాగులో ఈతకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు వచ్చిన వీరు లోతు తెలియక నీటిలో మునిగిపోయారు.

Updated : 13 Nov 2023 18:18 IST

నందిగామ: ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరు వాగులో ఈతకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు వచ్చిన వీరు లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో.. గమనించిన స్థానికులు బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు యువకులు మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన చేజర్ల దినేశ్‌, యడవల్లి గణేశ్‌, గాలి సంతోష్‌ కుమార్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని