Ghaziabad: అతిథులకు ట్రే తగిలిందని ఘాతుకం..వెయిటర్ను చంపి అడవిలో పడేసి..!
వివాహ వేడుకలో అతిథులకు ట్రే తగిలిందని ఓ వెయిటర్ను కొందరు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పడేశారు.
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో దారుణం చోటు చేసుకొంది. వివాహ వేడుకలో పాత్రలు తీసుకువెళుతున్న ట్రే అతిధులకు తగిలిందనే కారణంతో వెయిటర్ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఘాజియాబాద్ (Ghaziabad)లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..
అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!
మనోజ్ అనే వ్యక్తి వివాహ వేడుకల కాంట్రాక్టర్. అతడి వద్ద పంకజ్(26) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఘాజియాబాద్లోని సీసీఎస్ వాటికా గెస్ట్ హౌస్లో పెళ్లి జరిగింది. అక్కడ వెయిటర్ అవసరం కావడంతో తనతో పంకజ్ను తీసుకెళ్లాడు. అతడు అతిథులు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలోనే పొరపాటున అడ్డుగా ఉన్న అతిథులకు ట్రే తగిలింది. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్తా గొడవకు దారి తీయడంతో పంకజ్ను కాంట్రాక్టర్ మనోజ్ సహా మరికొందరు తీవ్రంగా చితకబాదారు. ఆ దెబ్బలకు తాళలేక పంకజ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు నిందితులు మృతదేహాన్ని సమీపంలో ఉన్న అడవిలో పడేశారు. పనికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరుసటి రోజు మనోజ్ను విచారించిన పోలీసులు అడవిలో మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టంకు తరలించగా.. తలకి బలమైన గాయం తగలడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్