Kakinada: డ్రైవర్‌కు బీపీ డౌన్‌.. టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ (TSRTC)కి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది.

Updated : 19 Feb 2024 14:00 IST

శంఖవరం: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ (TSRTC)కి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్‌ భాస్కరరావుకు బీపీ డౌన్‌ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పింది. ప్రమాద సమయంలో అందులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని