Crime News: లడ్డూ ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Eenadu icon
By Crime News Desk Updated : 01 Nov 2025 04:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మద్యం మత్తులో ఇద్దరి లైంగిక దాడి! 

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం మత్తుతో ఇద్దరు వ్యక్తుల అరాచకానికి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి నరకం చూసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌కు చెందిన దంపతులు మూడు నెలల క్రితం ఇక్కడకు వలస వచ్చారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుటుంబ పెద్ద పెయింటింగ్‌ కాంట్రాక్టర్‌ వద్ద కూలీ. వారి నివాసానికి ఎదురుగానే మధ్యప్రదేశ్‌కు చెందిన దినేశ్‌ కోల్‌(46), శివరాజ్‌ కోల్‌(45) ఉంటారు. వారు ఓ రసాయన పరిశ్రమలో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి ఎదురుగా ఉండే నాలుగేళ్ల చిన్నారి తోబుట్టువులతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో లడ్డూ ఇప్పిస్తానని దినేశ్‌ కోల్, శివరాజ్‌ కోల్‌ తమ ఇంట్లోకి ఎత్తుకెళ్తుండగా ఓ బాలిక చూసింది. కొద్దిసేపటికి చిన్నారి కేకలు వేయడంతో తల్లి విని ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. చూసిన బాలిక.. దినేశ్, శివరాజ్‌ తీసుకెళ్లారని చెప్పింది.

స్థానికులు తలుపు పగులగొట్టి చూడగా చిన్నారిపై వారు అఘాయిత్యానికి పాల్పడినట్లు గమనించి వెంటనే 100 నంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. చౌటుప్పల్‌ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ మన్మథకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి పంపించారు. నిందితులిద్దరూ బాగా మద్యం తాగినట్లు తెలిసింది. తన కుమార్తెపై దినేశ్, శివరాజ్‌ అత్యాచార యత్నానికి పాల్పడ్డారని చిన్నారి తల్లి చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా తమ దర్యాప్తు కొనసాగుతుందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Tags :
Published : 01 Nov 2025 03:34 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు