ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు (Students) ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి సరదాగా పర్వతారోహణకు వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన స్కాట్లాండ్ (Scotland)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. (Telugu Students found dead in Scotland)
తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం మరికొందరు భారత స్నేహితులతో కలిసి పెర్త్షైర్లోని ‘లిన్ ఆఫ్ తమ్మెల్’కి వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు.
సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వీరి మృతదేహాలను గుర్తించారు. ఈ ప్రమాదంపై లండన్లోని భారత హైకమిషన్ అధికారి ఒకరు స్పందించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్కు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
జితేంద్రనాథ్ గతంలో అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో చదివినట్లు తెలుస్తోంది. చాణక్య 2022లోనే హైదరాబాద్ జేఎన్టీయూ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు సమాచారం. ఘటనపై డూండీ యూనివర్సిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM