Crime news: దేవుడి కోసం ఆత్మ బలిదాన యత్నం.. చెట్లు నరికే యంత్రంతో తల కోసుకున్నాడు!
మూఢ భక్తితో ఓ వ్యక్తి తన ప్రాణాలను అర్పించుకునే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లఖ్నవూ : దేవుడికి నైవేద్యంగా తన తల సమర్పించడానికి యత్నించి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని లలిత్పుర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దీపక్ కుశ్వాహా అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేవుడి భక్తుడిగా చెప్పుకొంటూ దీపక్ వివిధ రకాల పూజలు నిర్వహించేవాడు. గత కొన్ని నెలలుగా అతడు తన శిరస్సును బలి ఇచ్చి దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటానని తెలిసినవారితో చెబుతూ వచ్చాడు. తన అర్పణ, దేవుని ప్రార్థనల గురించి ఓ నోట్బుక్ సైతం రాసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దీపక్ తండ్రి పాల్తూరామ్ ఆత్మ బలిదానం పిచ్చిపని అని ఓ రోజు మందలించాడు. అయినా వినకుండా తనకు యాగం చేయాలని ఉందని నెలరోజులుగా తండ్రికి చెబుతూ వచ్చాడు.
స్కూల్ బస్సు బోల్తా.. 9 మంది విద్యార్థులకు గాయాలు
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున స్థానిక ఆలయానికి దీపక్ వెళ్లాడు. హోమగుండం ఎదుట నిల్చొని దేవుణ్ని స్తుతిస్తూ తన వెంట తెచ్చుకున్న చెట్లు నరికే యంత్రంతో తల కోసుకునేందుకు యత్నించాడు. అరుపులు విన్న స్థానికులు పరిగెత్తుకుంటూ గుడిలోకి వెళ్లారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కళాశాలకు తరలించారు. ప్రస్తుతం దీపక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.