Crime news: దేవుడి కోసం ఆత్మ బలిదాన యత్నం.. చెట్లు నరికే యంత్రంతో తల కోసుకున్నాడు!
మూఢ భక్తితో ఓ వ్యక్తి తన ప్రాణాలను అర్పించుకునే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లఖ్నవూ : దేవుడికి నైవేద్యంగా తన తల సమర్పించడానికి యత్నించి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని లలిత్పుర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దీపక్ కుశ్వాహా అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేవుడి భక్తుడిగా చెప్పుకొంటూ దీపక్ వివిధ రకాల పూజలు నిర్వహించేవాడు. గత కొన్ని నెలలుగా అతడు తన శిరస్సును బలి ఇచ్చి దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటానని తెలిసినవారితో చెబుతూ వచ్చాడు. తన అర్పణ, దేవుని ప్రార్థనల గురించి ఓ నోట్బుక్ సైతం రాసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దీపక్ తండ్రి పాల్తూరామ్ ఆత్మ బలిదానం పిచ్చిపని అని ఓ రోజు మందలించాడు. అయినా వినకుండా తనకు యాగం చేయాలని ఉందని నెలరోజులుగా తండ్రికి చెబుతూ వచ్చాడు.
స్కూల్ బస్సు బోల్తా.. 9 మంది విద్యార్థులకు గాయాలు
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున స్థానిక ఆలయానికి దీపక్ వెళ్లాడు. హోమగుండం ఎదుట నిల్చొని దేవుణ్ని స్తుతిస్తూ తన వెంట తెచ్చుకున్న చెట్లు నరికే యంత్రంతో తల కోసుకునేందుకు యత్నించాడు. అరుపులు విన్న స్థానికులు పరిగెత్తుకుంటూ గుడిలోకి వెళ్లారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కళాశాలకు తరలించారు. ప్రస్తుతం దీపక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!