Bapatla: స్కూల్ బస్సు బోల్తా.. 9 మంది విద్యార్థులకు గాయాలు

బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదలో బస్సులోని 9 మంది విద్యార్థులకు గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Updated : 15 Aug 2023 14:51 IST

అమృతలూరు: బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులోని 9 మంది విద్యార్థులకు గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వేరే వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోతుండగా బస్సు బోల్తా పడినట్లు సమాచారం. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని