శంషాబాద్లో దారుణం.. మహిళను చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారు!
నగరంలోని శంషాబాద్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ (30)ను దుండగులు దారుణంగా హతమార్చారు.
హైదరాబాద్ (శంషాబాద్): నగరంలోని శంషాబాద్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ (30)ను దుండగులు దారుణంగా హతమార్చారు. శంషాబాద్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళను చంపేసిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడి కోసం గాలింపు
ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ ఏసీపీ రామ్చందర్రావు వివరాలు వెల్లడించారు. మహిళ మృతదేహం కాలిపోతుందని అర్ధరాత్రి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించినట్లు చెప్పారు. గుర్తుతెలియని మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టారని వివరించారు. మహిళను హత్యచేసి తగలబెట్టారా? లేదా సజీవ దహనం చేశారా? అనేది పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని తెలిపారు. మహిళ ఎవరనే వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. తొండుపల్లిలోని ఓ బంక్లో నిందితుడు బాటిల్లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మహిళను తగులబెట్టిన అతడికి మరో వ్యక్తి సాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలిని ఇతర రాష్ట్రానికి చెందిన మహిళగా భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. -
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. -
అమ్మానాన్నలే హంతకులయ్యారు
అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. -
రూ.105 కోట్ల హెరాయిన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. -
గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లిన దుండగులు
ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. -
విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!