Suicide: షూటింగ్ వేళ వాగ్వాదం.. ఏడు అంతస్తులపై నుంచి దూకి జంట ఆత్మహత్య
షూటింగ్ సమయంలో జరిగిన వాగ్వాదం కారణంగా సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. బహదూర్ఘర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
దిల్లీ: వారిద్దరూ కంటెంట్ క్రియేటర్లు. సోషల్మీడియాలో పాపులర్ అయినవాళ్లే. చాలాకాలంగా సహజీవనం చేస్తున్నారు. షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ప్రాణాల మీదకు తెచ్చింది. చివరకు ఆత్మహత్య చేసుకొనేలా చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. గ్రావిట్ (25), నందినీ (22) జంట గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ ఫేస్బుక్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ల్లో సొంతంగా ఛానెల్స్ నిర్వహిస్తున్నారు. డెహ్రాడూన్లో ఉంటున్న వీరు ఇటీవల బహదూర్ఘర్కు వచ్చారు. ఐదుగురు టీమ్మేట్స్తో కలసి ఓ ప్లాట్ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇటీవల షార్ట్ఫిల్మ్ షూటింగ్లో పాల్గొన్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కొట్లాట మరింత ముదిరింది. దీంతో ఆ ఇద్దరు ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
ఖాళీ స్థలంపై వివాదం.. మహిళను మంటల్లోకి తోసేసిన వైకాపా నేత!
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షూటింగ్ సమయంలో జరిగిన వాగ్వాదం కారణంగానే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. నిర్ధారణ కోసం సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!