రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు.
రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ
జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాదసభలో అభివాదం చేస్తున్న రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, వివేక్, ఏఐసీసీ కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తదితరులు
శ్రీరాంపూర్, మంచిర్యాల సిటీ, నస్పూర్, శ్రీరాంపూర్ గ్రామీణం- న్యూస్టుడే: మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. శనివారం రాత్రి జైపూర్ మండలం ఇందారం మూల మలుపు నుంచి నస్పూర్ వరకు దీప్దాస్ మున్షీ, మంత్రి శ్రీధర్బాబు, అభ్యర్థి వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు ర్యాలీగా నస్పూర్కు వచ్చారు. అనంతరం నస్పూర్లో కార్మిక గర్జనసభ, మంచిర్యాలలో ప్రజా ఆశీర్వాద సభల్లో ఆమె మాట్లాడారు. యువతతోనే దేశ భవిష్యత్తు.. అందుకే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా యువకుడిని పోటీలో ఉంచామన్నారు. దేశంలో యువకుడు ప్రధాని కావాలంటే రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారాస నియంత పాలనకు చరమగీతం పాడారో మరోసారి ఓటుతో భాజపాను ఇంటికి పంపించాలని కోరారు. కాంగ్రెస్ హామీ ఇస్తే అమలు చేస్తుందని, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలన్ని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈసారి కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. భాజపా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు వేశారా? అని ఆమె ప్రశ్నించారు. ఈసారి భాజపా ఎన్నికల హామీలకు బదులుగా మోదీ గ్యారంటీల పేరిట ప్రచారం చేస్తున్నారని వ్యక్తి పూజపై ఆమె పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి ఇక్కడి ప్రజలు కానుకగా రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారన్నారు. అదే విధంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంటు ఎన్నికల్లో భాజపాను గద్దె దించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, మహిళా సమస్యల పరిష్కారం, కార్మిక, కర్షకుల, శ్రామికుల కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పారు.
విశ్రాంత కార్మికులకు రేషన్కార్డులు ఇవ్వాలని వినతి
అర్హులైన సింగరేణి విశ్రాంతి కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని ఐటీ మంత్రి శ్రీధర్బాబును ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కోరారు. ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 45 రోజుల్లోనే నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీర్చినట్లు పేర్కొన్నారు. 4 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించామని, మరో 1500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. కార్మిక వారసుల ఉద్యోగ వయసును 40 ఏళ్లకు పెంచే విషయంపై సంబంధిత మంత్రులు సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పని చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేర్కొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో పబ్లిక్ రంగ సంస్థలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి లోక్సభ నియోజకర్గ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీసీసీ అభ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి రోహిత్ చౌదరి, ఏఐసీసీˆ కార్యదర్శులు విశ్వనాథ్, వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు డి.శ్రీనివాస్, శ్రావణ్, శశాంక్సింగ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్కుమార్, సుర్మిళ్ల వేణు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి: మంత్రి శ్రీధర్బాబు
శ్రీరాంపూర్ వద్ద ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, ఎన్నికల నియమావళి పూర్తయిన వెంటనే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాహుల్గాంధీ ప్రధాని అయితేనే సింగరేణిలో కొత్త గనులు వస్తాయని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు. తొండి మాటలు చెబుతున్న హరీశ్రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన మాజీ సర్పంచులు
[ 11-05-2024]
తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు సరితా రెడ్డి, వెంకన్న వార్డు సభ్యులతో కలిసి -
భాజపా అభ్యర్థి నగేష్ ప్రచారం
[ 11-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిప్పలకోటి, నిపాని, భీంపూర్, దనోర, వడూర్, అర్లి, అంతర్గావ్, గోముత్రి, కరణ్ వాడి, కరంజి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. -
ప్రముఖ వైద్యుడు తిప్పే స్వామికి అస్వస్థత
[ 11-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు తిప్పే స్వామి శనివారం అస్వస్థతకు గురయ్యారు. -
ప్రధాన పార్టీల్లో పైసల లొల్లి?
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పైసల లొల్లి మొదలైంది. -
విత్తు రైతు చిత్తు
[ 11-05-2024]
విత్తనోత్పత్తికి జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో యాసంగిలో ఏటా శనగ విత్తనాలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 20 గ్రామాల్లో ఆసక్తి గల రైతులను ఎంపిక చేసి శనగ విత్తనోత్పత్తి చేయించారు. -
మేం తలుచుకుంటే గల్లీలో మీరు తిరగలేరు
[ 11-05-2024]
భారాస కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే గల్లీల్లో ఏ భాజపా, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. భైంసా పర్యటనలో ఉన్న కేటీఆర్పై రెండు పార్టీల కార్యకర్తలు ఉల్లిగడ్డలతో దాడి ఎలా చేస్తారన్నారు. -
కదిలొచ్చిన ‘కమల’దళం
[ 11-05-2024]
భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో పురవీధులు కాషాయమయమయ్యాయి. -
భాజపా తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
[ 11-05-2024]
భారత రాజ్యాంగం, రిజర్వేషన్లపై భాజపా వైఖరితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. -
ప్రచారం నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారంతో పరిసమాప్తం కానుంది. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. -
రహదారులపైనే వ్యాపారాలు
[ 11-05-2024]
రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రమాదాల నివారణకు రహదారుల మధ్య డివైడర్లు నిర్మిస్తూ, రహదారులను విస్తరిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
ఓటేస్తాం.. సమర్థులను ఎన్నుకుంటాం
[ 11-05-2024]
ఓటు వేస్తే ఏమిటీ, వేయకపోతే ఏమిటీ అనే నిర్లక్ష్య ధోరణిని విడనాడుతామని నవ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత దూరమున్నా ఎన్నికల రోజు సొంతూరు చేరుకుంటామని, అయిదేళ్లు సుపరిపాలనకు తామే నిర్మాతలమని అంటున్నారు. -
మౌనం వీడిన సోయం!
[ 11-05-2024]
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీ సోయం బాపురావు ఎట్టకేలకు మౌనం వీడారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. -
నోటా జోరు.. పార్టీల బేజారు
[ 11-05-2024]
ఎన్నికల్లో ఆడింది ఆట.. తాము పాడిందే పాటగా వ్యవహరించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆటలు ఇక సాగవని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు ఓటర్లు. కులం, మతం, అంగ, అర్థ బలాలకంటే అభ్యర్థి గుణ గణాలు, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయ్యాలి..
[ 11-05-2024]
మరో రెండు రోజుల్లో జరిగే లోక్సభ పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. -
అటవీ అధికారులు, రైతుల మధ్య భూవివాదం!
[ 11-05-2024]
రెబ్బెన ఫారెస్టు రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి సెక్షన్, తుంగెడ బీట్ పరిధిలో 417 కంపార్టుమెంట్ (రిజర్వు ఫారెస్టు)లో.. తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని బెస్తవాడకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఉదయం భూమి చదును చేసేందుకు వెళ్లారు. -
మేం ఓటేసేదెలా..?
[ 11-05-2024]
జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి శుక్రవారం ఎన్నికల విధులు కేటాయించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటు ఒకచోట ఉండి, తమకు వేరే చోట విధులు కేటాయిస్తే.. ఎలా వేసేదని చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల సమరం.. నిర్వహణే కీలకం
[ 11-05-2024]
ఎన్నికల నిర్వహణ అంత సులువైన వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైనది. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమపడాల్సి ఉంటుంది. -
ఇక ఇంటింటా...
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు పూర్తికావడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్