ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు.
బెజ్జూరులో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, చిత్రంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
బెజ్జూరు, న్యూస్టుడే: కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. శనివారం బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేతిగుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత, ఉపాధిహామీ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా జమ చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. దేవుడిని ముందు పెట్టి భాజపా రాజకీయాలు చేస్తుందన్నారు. మోదీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో రాముడిని చూపుతున్నారని తెలిపారు. రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పదేళ్లలో మోదీ, కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని, రైతుబంధు రాని అన్నదాతలందరికీ వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందని, త్వరలో పేదలకు ఇళ్లు అందించి పింఛన్లు పెంచుతామని తెలిపారు. ఎంపీ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. తనకు ఎంపీగా అవకాశం ఇస్తే ఉమ్మడి జిల్లాలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లకు కేంద్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు పూర్తి కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో 560 మంది పేదలకు పెళ్లిళ్లు చేసి కల్యాణలక్ష్మి ఇప్పించినట్లు గుర్తు చేశారు. వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్లో చేరారు. అనంతరం మంత్రిని పలువురు సన్మానించి సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్, జడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, జడ్పీ మాజీ ఛైర్మన్ గణపతి, ఎంపీపీలు రోజా రమణి, నానయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ ఓంప్రకాశ్, బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీవర్ధన్, మండల అధ్యక్షుడు శంకర్, ఎంపీటీసీలు పర్వీన్సుల్తానా, శ్రీనివాస్, వెంకన్న, కోఆప్షన్ సభ్యుడు బషరత్ఖాన్, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాన పార్టీల్లో పైసల లొల్లి?
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పైసల లొల్లి మొదలైంది. -
విత్తు రైతు చిత్తు
[ 11-05-2024]
విత్తనోత్పత్తికి జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో యాసంగిలో ఏటా శనగ విత్తనాలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 20 గ్రామాల్లో ఆసక్తి గల రైతులను ఎంపిక చేసి శనగ విత్తనోత్పత్తి చేయించారు. -
మేం తలుచుకుంటే గల్లీలో మీరు తిరగలేరు
[ 11-05-2024]
భారాస కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే గల్లీల్లో ఏ భాజపా, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. భైంసా పర్యటనలో ఉన్న కేటీఆర్పై రెండు పార్టీల కార్యకర్తలు ఉల్లిగడ్డలతో దాడి ఎలా చేస్తారన్నారు. -
కదిలొచ్చిన ‘కమల’దళం
[ 11-05-2024]
భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో పురవీధులు కాషాయమయమయ్యాయి. -
భాజపా తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
[ 11-05-2024]
భారత రాజ్యాంగం, రిజర్వేషన్లపై భాజపా వైఖరితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. -
ప్రచారం నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారంతో పరిసమాప్తం కానుంది. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. -
రహదారులపైనే వ్యాపారాలు
[ 11-05-2024]
రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రమాదాల నివారణకు రహదారుల మధ్య డివైడర్లు నిర్మిస్తూ, రహదారులను విస్తరిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
ఓటేస్తాం.. సమర్థులను ఎన్నుకుంటాం
[ 11-05-2024]
ఓటు వేస్తే ఏమిటీ, వేయకపోతే ఏమిటీ అనే నిర్లక్ష్య ధోరణిని విడనాడుతామని నవ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత దూరమున్నా ఎన్నికల రోజు సొంతూరు చేరుకుంటామని, అయిదేళ్లు సుపరిపాలనకు తామే నిర్మాతలమని అంటున్నారు. -
మౌనం వీడిన సోయం!
[ 11-05-2024]
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీ సోయం బాపురావు ఎట్టకేలకు మౌనం వీడారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. -
నోటా జోరు.. పార్టీల బేజారు
[ 11-05-2024]
ఎన్నికల్లో ఆడింది ఆట.. తాము పాడిందే పాటగా వ్యవహరించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆటలు ఇక సాగవని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు ఓటర్లు. కులం, మతం, అంగ, అర్థ బలాలకంటే అభ్యర్థి గుణ గణాలు, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయ్యాలి..
[ 11-05-2024]
మరో రెండు రోజుల్లో జరిగే లోక్సభ పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. -
అటవీ అధికారులు, రైతుల మధ్య భూవివాదం!
[ 11-05-2024]
రెబ్బెన ఫారెస్టు రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి సెక్షన్, తుంగెడ బీట్ పరిధిలో 417 కంపార్టుమెంట్ (రిజర్వు ఫారెస్టు)లో.. తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని బెస్తవాడకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఉదయం భూమి చదును చేసేందుకు వెళ్లారు. -
మేం ఓటేసేదెలా..?
[ 11-05-2024]
జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి శుక్రవారం ఎన్నికల విధులు కేటాయించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటు ఒకచోట ఉండి, తమకు వేరే చోట విధులు కేటాయిస్తే.. ఎలా వేసేదని చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల సమరం.. నిర్వహణే కీలకం
[ 11-05-2024]
ఎన్నికల నిర్వహణ అంత సులువైన వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైనది. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమపడాల్సి ఉంటుంది. -
ఇక ఇంటింటా...
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు పూర్తికావడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్