వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది.
నేతలు, అధికారుల కుమ్మక్కు
582 సర్వే నంబరులోని భూమి
ఈనాడు, ఆసిఫాబాద్: ‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. ఈ తతంగమంతా గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూ.. ధరణి రిజిస్ట్రేషన్ వరకు వచ్చి నిలిచిపోయింది. పైరవీలతో ఈ భూమిని దక్కించుకోవాలని కొందరు వ్యక్తులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని సమాచారం. సర్వే నంబర్లు మార్చేస్తూ, కొత్తవి సృష్టిస్తూ సాగుతున్న ఈ భూ దందాలో కొందరు జిల్లాస్థాయి అధికారులతోపాటు మరికొందరు ముఖ్య నాయకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ భూ పందేరాలకు అడ్డుకట్ట పడేలా రెవెన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జిల్లావ్యాప్తంగా నిజాం కాలంలో చాలా మందికి వందల ఎకరాల పట్టాలు ఉండేవి. ఇదే విధంగా సిర్పూర్(టి) పట్టణానికి చెందిన నాగేందర్సింగ్కు 582 సర్వే నంబరులో 100 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులో సిర్పూర్(టి) మండల కేంద్రంలో కొన్ని నివాసాలు, పంట పొలాలతోపాటు, రైల్వే లైన్ పక్కన ఉన్న చిట్టడివి, మామిడి, నిమ్మ తోటలు, మరికొంత పోరంబోకు భూములు ఉన్నాయి. సదరు పట్టాదారు మహారాష్ట్రలో స్థిరపడ్డాడు. ఈ భూములపై కొందరు నేతలు, అధికారుల కళ్లు పడ్డాయి. తమకు అనుకూలమైన నలుగురు వ్యక్తుల పేర్లతో ఈ భూమిని కాజేయడానికి తలా 25 ఎకరాలు వచ్చేలా పన్నాగం పన్నారు.
సర్వే నంబరునే మార్చి...
582 సర్వే నంబరును మార్చి 523 సర్వే నంబరుగా రికార్డులు తయారు చేశారు. వాస్తవంగా 523 సర్వే నంబరులో 812 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఇవన్నీ రక్షిత అటవీ భూములు, నిషేధిత జాబితాలో ఉన్నాయి. కొందరికి లావుణి పట్టాలు ఉన్నాయి. వీరందరూ ఎకరం, రెండు ఎకరాల చొప్పున సాగు చేసుకుంటున్నారు. పాత సర్వే నంబరు 582 అని చెబుతూ కొత్త సర్వే నంబరు 523లో నలుగురు వ్యక్తులు వంద ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయగా ఇంతకుముందు పనిచేసిన తహసీల్దార్లు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేశారు. సర్వేయర్లు కొలతలు తీసి హద్దులు నిర్ధారించేశారు. ఇక పట్టాలు ఇవ్వడమే ఆలస్యం.
ధరణిలో 523 సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉండగా, 812 ఎకరాల భూమి అటవీ భూమిగా ఉన్న వివరాలు
ప్రభుత్వ భూమి ఉండటంతోనే..
మాజీ సర్వే నంబరు అంటేనే చాలా వరకు ప్రభుత్వ భూమి ఉంటుందని సీనియర్ రెవెన్యూ అధికారి తెలిపారు. అంటే 582లో ఉన్న ప్రభుత్వ భూమి చేతిరాతగా సదరు పట్టదారు పేరు మీద 100 ఎకరాల వరకు ఉంది. ఇంత మేరకు భూమి ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉండటంతో, నలుగురు వ్యక్తులు రంగ ప్రవేశం చేసి సర్వే నంబరు మార్చి భూమిని కాజేసే యత్నం జరుగుతున్నట్లు సమాచారం.
582 సర్వే నంబరులో మార్చుతూ 523 (మాజీ) కొత్త సర్వే నంబరులో పట్టా భూమిగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన ధ్రువపత్రం
అధికారులు ఏం చేస్తున్నారు?
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక్క వ్యక్తికి కేవలం 50 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి. ప్రస్తుతం నాగేందర్ సింగ్ అనే వ్యక్తికి వంద ఎకరాల భూమి ఉన్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఏ అధికారి వద్ద స్పష్టమైన సమాధానం లేకపోవడం గమనార్హం. ఏం చెబితే తమ మెడకు ఏం చుట్టుకుంటుందో అని, గతంలో ఉన్న అధికారులు ఈ తప్పు చేశారనే సమాధానాలే రెవెన్యూ అధికారుల నుంచి వస్తున్నాయి. సర్వే నంబర్లనే మార్చుతూ అప్పనంగా వందల ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న వారిని, వీరికి సహకరిస్తున్న అధికారులను ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాన పార్టీల్లో పైసల లొల్లి?
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పైసల లొల్లి మొదలైంది. -
విత్తు రైతు చిత్తు
[ 11-05-2024]
విత్తనోత్పత్తికి జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో యాసంగిలో ఏటా శనగ విత్తనాలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 20 గ్రామాల్లో ఆసక్తి గల రైతులను ఎంపిక చేసి శనగ విత్తనోత్పత్తి చేయించారు. -
మేం తలుచుకుంటే గల్లీలో మీరు తిరగలేరు
[ 11-05-2024]
భారాస కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే గల్లీల్లో ఏ భాజపా, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. భైంసా పర్యటనలో ఉన్న కేటీఆర్పై రెండు పార్టీల కార్యకర్తలు ఉల్లిగడ్డలతో దాడి ఎలా చేస్తారన్నారు. -
కదిలొచ్చిన ‘కమల’దళం
[ 11-05-2024]
భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో పురవీధులు కాషాయమయమయ్యాయి. -
భాజపా తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
[ 11-05-2024]
భారత రాజ్యాంగం, రిజర్వేషన్లపై భాజపా వైఖరితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. -
ప్రచారం నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారంతో పరిసమాప్తం కానుంది. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. -
రహదారులపైనే వ్యాపారాలు
[ 11-05-2024]
రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రమాదాల నివారణకు రహదారుల మధ్య డివైడర్లు నిర్మిస్తూ, రహదారులను విస్తరిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
ఓటేస్తాం.. సమర్థులను ఎన్నుకుంటాం
[ 11-05-2024]
ఓటు వేస్తే ఏమిటీ, వేయకపోతే ఏమిటీ అనే నిర్లక్ష్య ధోరణిని విడనాడుతామని నవ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత దూరమున్నా ఎన్నికల రోజు సొంతూరు చేరుకుంటామని, అయిదేళ్లు సుపరిపాలనకు తామే నిర్మాతలమని అంటున్నారు. -
మౌనం వీడిన సోయం!
[ 11-05-2024]
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీ సోయం బాపురావు ఎట్టకేలకు మౌనం వీడారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. -
నోటా జోరు.. పార్టీల బేజారు
[ 11-05-2024]
ఎన్నికల్లో ఆడింది ఆట.. తాము పాడిందే పాటగా వ్యవహరించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆటలు ఇక సాగవని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు ఓటర్లు. కులం, మతం, అంగ, అర్థ బలాలకంటే అభ్యర్థి గుణ గణాలు, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయ్యాలి..
[ 11-05-2024]
మరో రెండు రోజుల్లో జరిగే లోక్సభ పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. -
అటవీ అధికారులు, రైతుల మధ్య భూవివాదం!
[ 11-05-2024]
రెబ్బెన ఫారెస్టు రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి సెక్షన్, తుంగెడ బీట్ పరిధిలో 417 కంపార్టుమెంట్ (రిజర్వు ఫారెస్టు)లో.. తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని బెస్తవాడకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఉదయం భూమి చదును చేసేందుకు వెళ్లారు. -
మేం ఓటేసేదెలా..?
[ 11-05-2024]
జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి శుక్రవారం ఎన్నికల విధులు కేటాయించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటు ఒకచోట ఉండి, తమకు వేరే చోట విధులు కేటాయిస్తే.. ఎలా వేసేదని చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల సమరం.. నిర్వహణే కీలకం
[ 11-05-2024]
ఎన్నికల నిర్వహణ అంత సులువైన వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైనది. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమపడాల్సి ఉంటుంది. -
ఇక ఇంటింటా...
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు పూర్తికావడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
-
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
-
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
-
తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో రూ.7కోట్లు తరలింపు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM