అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి.
బియ్యం మిల్లుల ఏర్పాటుపై అనుమానాలు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
ఆదిలాబాద్లోని రైస్ మిల్లు
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న ఓ రైస్మిల్లులో ఆదిలాబాద్లోని వినాయక ట్రేడర్స్ పేరిట ఎఫ్సీఐ ముద్రవేసి ఉన్న బియ్యం సంచులను పోలీసులు పట్టుకోవడం సంచలనం రేపింది. జిల్లాలోని రైస్మిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఉట్నూరు మండలంలోనే వరి సాగు చేస్తారు. ఏటా ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్లో 2 వేల టన్నులు, రబీలో 600 టన్నుల వరకు ధాన్యం సేకరిస్తున్నారు. ఎంత లేదన్నా ఏడాదికి 3 వేల టన్నుల ధాన్యం దాటడం లేదు.
జిల్లాలో సేకరించిన ధాన్యం ఒక రైస్ మిల్లుకే సరిపోతుంది. ఆదిలాబాద్ పట్టణ శివారుల్లోని రాంపూర్, బట్టిసావర్గాం, పొన్నారి, దస్నాపూర్ ఏరియాల్లో మొత్తం తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పడ్డాయి. 2019 నుంచి ఇది మొదలైంది. తొలుత ఒకే రైస్ మిల్లు ఉండగా ఆ తరువాత కొన్ని నెలల్లోనే చకచకా పెరుగుతూ వచ్చాయి. జిల్లాలో సేకరించిన ధాన్యం తక్కువగా ఉండటంతో ఒక్కో మిల్లుకు రెండు మూడు లారీలకు సరిపడా ధాన్యాన్ని అధికారులు పంపిస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదు. పోని ప్రైవేటు పరంగా మిల్లు యజమానులు కొనుగోలు చేద్దామంటే ఇక్కడ ధాన్యం పంటనే లేదు. మరోప్రాంతంనుంచి ఇక్కడికి ధాన్యం తీసుకురావడానికి రవాణా ఖర్చులే తడిసి మోపెడవుతాయి. దీనివల్ల నష్టాలు ఎక్కువవుతాయి. అయినా ఇక్కడ తొమ్మిది రైస్ మిల్లులు ఉండటం వెనుక మర్మమేంటనేది అధికారులకే తెలియాలి. మిల్లుల పేరిట కొందరు అక్రమ దందా నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఈ మిల్లులకు మంచిర్యాల జిల్లా నుంచి అధికారులు ధాన్యాన్ని పంపించారు. అవే నిల్వలు ప్రస్తుతం అక్కడి గోదాంలలో నిల్వలున్నాయని చెబుతున్నారు. మంచిర్యాలలోనే కొత్త మిల్లులు ఏర్పాటు చేయకుండా పంట లేనిచోట ఆదిలాబాద్లో ఏర్పాటు చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ జిల్లాకు పక్కనే మహారాష్ట్ర ప్రాంతం ఉంది. అక్కడ ధర అధికంగా ఉండటం వల్ల ధాన్యం, బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే ప్రచారం ఉంది.
ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు సుధారాణిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా.. తాను రాక ముందు నుంచి మిల్లులు ఉన్నాయి. కొత్త మిల్లులకు దరఖాస్తులు వచ్చినా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. జిల్లాలో ధాన్యం నిల్వల వివరాలు సంగారెడ్డి పోలీసులు వచ్చి తీసుకెళ్లారన్నారు.
నిజామాబాద్ జిల్లావాసులకు సంబంధం
ఇప్పటికే తొమ్మిది రైస్ మిల్లులుండగా, కొత్తగా మరో అయిదింటికి అనుమతులు ఇచ్చేందుకు అధికారుల వద్ద దస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. అక్రమాల్లో పేరుగాంచిన వ్యాపారులే ఈ మిల్లుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటాన్చెరులో కేసు నమోదైన నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన వ్యాపారి బినామి పేర్లపై ఆదిలాబాద్ జిల్లాలో అయిదు మిల్లులు నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్కు చెందిన కొందరు రాజకీయ నాయకులకు జిల్లాలోని మిల్లుల్లో భాగస్వామ్యం ఉందని సమాచారం. ఇప్పటికే మిల్లులు, గోదాంలు లీజుకిచ్చిన ఆదిలాబాద్లోని వ్యాపారులు, కొందరు కూలీలు, డ్రైవర్లను పటాన్చెరు పోలీసులు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాన పార్టీల్లో పైసల లొల్లి?
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పైసల లొల్లి మొదలైంది. -
విత్తు రైతు చిత్తు
[ 11-05-2024]
విత్తనోత్పత్తికి జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో యాసంగిలో ఏటా శనగ విత్తనాలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 20 గ్రామాల్లో ఆసక్తి గల రైతులను ఎంపిక చేసి శనగ విత్తనోత్పత్తి చేయించారు. -
మేం తలుచుకుంటే గల్లీలో మీరు తిరగలేరు
[ 11-05-2024]
భారాస కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే గల్లీల్లో ఏ భాజపా, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. భైంసా పర్యటనలో ఉన్న కేటీఆర్పై రెండు పార్టీల కార్యకర్తలు ఉల్లిగడ్డలతో దాడి ఎలా చేస్తారన్నారు. -
కదిలొచ్చిన ‘కమల’దళం
[ 11-05-2024]
భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో పురవీధులు కాషాయమయమయ్యాయి. -
భాజపా తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
[ 11-05-2024]
భారత రాజ్యాంగం, రిజర్వేషన్లపై భాజపా వైఖరితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. -
ప్రచారం నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారంతో పరిసమాప్తం కానుంది. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. -
రహదారులపైనే వ్యాపారాలు
[ 11-05-2024]
రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రమాదాల నివారణకు రహదారుల మధ్య డివైడర్లు నిర్మిస్తూ, రహదారులను విస్తరిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
ఓటేస్తాం.. సమర్థులను ఎన్నుకుంటాం
[ 11-05-2024]
ఓటు వేస్తే ఏమిటీ, వేయకపోతే ఏమిటీ అనే నిర్లక్ష్య ధోరణిని విడనాడుతామని నవ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత దూరమున్నా ఎన్నికల రోజు సొంతూరు చేరుకుంటామని, అయిదేళ్లు సుపరిపాలనకు తామే నిర్మాతలమని అంటున్నారు. -
మౌనం వీడిన సోయం!
[ 11-05-2024]
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీ సోయం బాపురావు ఎట్టకేలకు మౌనం వీడారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. -
నోటా జోరు.. పార్టీల బేజారు
[ 11-05-2024]
ఎన్నికల్లో ఆడింది ఆట.. తాము పాడిందే పాటగా వ్యవహరించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆటలు ఇక సాగవని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు ఓటర్లు. కులం, మతం, అంగ, అర్థ బలాలకంటే అభ్యర్థి గుణ గణాలు, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయ్యాలి..
[ 11-05-2024]
మరో రెండు రోజుల్లో జరిగే లోక్సభ పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. -
అటవీ అధికారులు, రైతుల మధ్య భూవివాదం!
[ 11-05-2024]
రెబ్బెన ఫారెస్టు రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి సెక్షన్, తుంగెడ బీట్ పరిధిలో 417 కంపార్టుమెంట్ (రిజర్వు ఫారెస్టు)లో.. తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని బెస్తవాడకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఉదయం భూమి చదును చేసేందుకు వెళ్లారు. -
మేం ఓటేసేదెలా..?
[ 11-05-2024]
జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి శుక్రవారం ఎన్నికల విధులు కేటాయించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటు ఒకచోట ఉండి, తమకు వేరే చోట విధులు కేటాయిస్తే.. ఎలా వేసేదని చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల సమరం.. నిర్వహణే కీలకం
[ 11-05-2024]
ఎన్నికల నిర్వహణ అంత సులువైన వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైనది. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమపడాల్సి ఉంటుంది. -
ఇక ఇంటింటా...
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు పూర్తికావడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?