logo

కార్మికుల్లో సామాజిక స్పృహ అభినందనీయం

కార్మికుల్లో సామాజిక స్పృహ  ఉండటం అభినందనీయమని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 11:43 IST

ఎదులాపురం : కార్మికుల్లో సామాజిక స్పృహ  ఉండటం అభినందనీయమని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ కిరాణా అండ్ జనరల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  కార్మికులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓను అసోసియేషన్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ రాజలింగు, అసోసియేషన్ అధ్యక్ష,  కార్యదర్శులు గణేష్, దాదాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు