కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఆరోపించారు.
రాంబాబుకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న శిరీషాదేవి
రాజవొమ్మంగి, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఆరోపించారు. రాజవొమ్మంగిలో శనివారం మహిళలతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్తో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ చంద్రబాబు మహిళా పక్షపాతి అని గతంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రస్తుతం కూడా మరెన్నో పథకాలకు రూపకల్పన చేశారన్నారు. సొంత చెల్లి, తల్లికే న్యాయం చేయని జగన్ ఇక రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తారన్నారు. ఇది మహిళలందరు గమనించాలన్నారు. ఈ వైకాపా ప్రభుత్వంలో దళిత యువకుడి హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబు కొద్ది నెలల్లోనే బయటకు రాగా కోడికత్తి కేసులో నిందితుడు బయటకు రావడానికి చాలా ఏళ్లు పట్టిందని ఆరోపించారు. వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే ధనలక్ష్మికి పనిచేయాలని ఉన్నా వెనుక ఉన్న వ్యక్తి చేయనివ్వరని విమర్శించారు. తెదేపాలో అటువంటిది ఉండదన్నారు. సాధారణ మహిళ, అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్డంగి నుంచి ఆదివాసీ నాయకుడు టి.రాంబాబు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు జి.పెద్దిరాజు, ఎం.సావిత్రి, ఎం.కేశవ్, బి.త్రిమూర్తులు, స్వప్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
వైకాపా అరాచక పాలనపై జనం తిరుగుబాటు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించడంతో వారిలో తిరుగుబాటు మొదలైందని రంపచోడవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. -
కూటమితోనే గిరిజనుల అభ్యున్నతి
[ 11-05-2024]
ఎన్డీఏ గెలుపుతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు పట్టణంలో మూడు పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
[ 11-05-2024]
మన్యంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. పెదబయలు మండలంలోని గ్రామాల్లో భారీ వాన పడింది. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
మత్తులో ముంచొద్దు.. మీకో దండం
[ 11-05-2024]
రోజంగా చెమటోచ్చి సంపాదించిన మొత్తం ‘జె’ బ్రాండ్ మద్యానికే ధారపోస్తున్నారు. మందుకు బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. -
ఎన్నికల నిబంధనలకు వైకాపా తూట్లు
[ 11-05-2024]
వైకాపా బరితెగిస్తోంది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బస్సులు రావు.. బాధలు తీరవు!
[ 11-05-2024]
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో చాలా గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిపేది. కాలక్రమంలో రహదారులు బాగోలేవంటూ కొన్ని, రాబడి రావడం లేదంటూ మరికొన్ని రద్దు చేయడంతో గిరిజనులకు రవాణా కష్టాలు వీడటం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్