logo

జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి తెదేపాలో చేరిక

రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం  కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 29 Apr 2024 01:44 IST

జ్యోతికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న శిరీషాదేవి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం  కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా పార్టీ,  నాయకుల వ్యవహార శైలి నచ్చక పార్టీ మారినట్లు జ్యోతి తెలిపారు. మాజీ సర్పంచి చీడిపల్లి అప్పారావు, గింజర్తి వార్డు సభ్యురాలు కృష్ణవేణి, జడ్పీటీసీ సభ్యురాలి భర్త రవి కూడా తెదేపాలో చేరారు.  కార్యక్రమంలో తెదేపా మండల శాఖ అధ్యక్షుడు జి.పెద్దిరాజు, జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బి.త్రిమూర్తులు, ఆయా పార్టీల నాయకులు తాతారావు, సోమినాయుడు, లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని