logo

కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా

రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు  కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 03:15 IST

సంఘీభావం తెలుపుతున్న కూటమి ప్రతినిధులు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు  కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన  మాట్లాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. నిఘా వ్యవస్థలన్నీ స్వతంత్రను కోల్పోయాయన్నారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారన్నారు. పోలవరం, విశాఖ రైల్వే జోన్‌ వంటి అంశాల్లోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారన్నారు. తాము కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తామన్నారు. జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌  ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్‌, ఎమ్మెల్యే అభ్యర్థులు ఐఆర్‌ గంగాధర్‌ (అనకాపల్లి), తనకాల అనంతరావు (ఎలమంచిలి), బోని తాతారావు (పాయకరావుపేట), రుత్తల శ్రీరామమూర్తి (నర్సీపట్నం), బి.శ్రీనివాసరావు (మాడుగుల), జగతా శ్రీనివాసరావు (చోడవరం) హాజరయ్యారు. నాయకులు జగన్‌, రాజాన దొరబాబు, రామునాయుడు, వైఎన్‌ భద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని