బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు.
మద్యం దుకాణం వద్ద వైకాపా కార్యకర్తల బారులు
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, చోడవరం: సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. చోడవరంలో జరిగిన సభలో మాటకు ముందు, తర్వాత గోవిందా.. గోవిందా అనడం గమనార్హం. కొత్తూరు నాలుగు రోడ్ల కూడలికి సమీపంలోని తెదేపా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జగన్ వాహనంపై నుంచి ప్రసంగించారు. నానా ఇబ్బందులు పడి జనాన్ని తరలించిన నాయకులు చప్పగా సాగిన జగన్ ప్రసంగంతో డీలా పడ్డారు. జగన్ తన ప్రసంగంలో ఎక్కడా బీఎన్ రహదారి విస్తరణ, చక్కెర కర్మాగారాల ప్రస్తావన తీసుకురాలేదు. ధర్మశ్రీ రాసి ఇవ్వగా.. గోవాడ చక్కెర కర్మాగారాన్ని ఆదుకున్నామంటూ ముక్తసరిగా చెప్పి ముగించేశారు. చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించారు. తిరుగు ప్రయాణంలో హెలిపాడ్ వద్ద జగన్ను మాజీ మంత్రులు బలిరెడ్డి సత్యారావు కుమార్తె నాగమణి, ఎం.బాలరాజు కుమార్తె, మనుమరాలు కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రునాయుడు బస్సు వద్ద జగన్ను కలిసి మాట్లాడారు.
సీఎం ప్రసంగిస్తుండగా వెనుదిరిగి వెళ్తున్న జనం
పది కి.మీ. ముందే బస్సులు బంద్..
సీఎం జగన్ ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపించారు. చోడవరం ప్రధాన రహదారిపై రోడ్షో ఏర్పాటు చేయడంతో ఇరువైపులా పది కి.మీ ముందే వాహనాలను నిలిపేశారు. విశాఖ నుంచి చోడవరం, మాడుగుల, పాడేరు వెళ్లే బస్సులు సీఎం సభకు 7 కి.మీ దూరంలోని వెంకన్నపాలెం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆపేశారు. పాడేరు, నర్సీపట్నం నుంచి చోడవరం వైపు వచ్చే బస్సులను 10 కి.మీ ముందే వడ్డాది కూడలి వద్ద నిలిపేశారు. దీంతో అక్కడి నుంచి చోడవరంతో పాటు ఎగువ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులంతా ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు సైతం కొంత దూరం వరకే అనుమతించి అక్కడ నుంచి ఇతర మార్గాలకు మళ్లించడంతో పిల్లాపాపలతో అవస్థలు పడ్డారు. వాహనాల్లేక ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సీఎం హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డుగా ఉన్నాయని విద్యుత్తు తీగలను కట్ చేయడంతో కొన్ని వీధుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్షో జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల దుకాణాలన్నీ బంద్ చేసుకోవాల్సి వచ్చింది. మద్యం దుకాణం దగ్గర మాత్రం సీఎం సభకు వచ్చిన వారు బారులు తీరారు. ఒక్కొక్కరికి రూ.300, బిర్యాని పొట్లాం ఇచ్చినట్లు సభకు వచ్చిన కొంత మంది మహిళలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
ఓటింగులో వీరే ఆదర్శం
[ 16-05-2024]
రహదారి సౌకర్యంలేని మారుమూల గ్రామాల వారికి గో‘దారే‘ దిక్కుగా మారింది. శ్రీరామగిరి పంచాయతీ కల్తునూరు, తుమ్మిలేరు పోచవరం పంచాయతీ పరిధి కొల్లూరు, గొందూరు, తుమ్మిలేరు -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
అరకు పార్లమెంట్ పరిధిలో 73.68 పోలింగ్ నమోదు
[ 16-05-2024]
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 73.68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం వెల్లడించారు. -
కూటమికే అనుకూల ఫలితాలు
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా పాలనపై వ్యతిరేకత పెరిగింది అనడానికి సార్వత్రిక ఎన్నిల్లో పోలింగే నిదర్శనమని కూటమి పాడేరు శాసనసభ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
వరుస ప్రమాదాలతో బెంబేలు..
[ 16-05-2024]
జిల్లాలో జాతీయ రహదారితోపాటు గ్రామీణ రహదారులు వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం: పీలా
[ 16-05-2024]
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 80 వేలకు పైగా, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ 30 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. -
ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మన్యంలో తప్పని డోలి మోతలు
[ 16-05-2024]
మన్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో డోలి మోతలు తప్పడం లేదు. -
మన్యం ఓటర్లు పోటెత్తారు..!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జనం ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేశారు. నియోజకవర్గం పరిధిలో 63.91 శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం బుధవారం ప్రకటించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
విశాఖ జిల్లాలో 70.03 శాతం పోలింగ్
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
-
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!
-
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
-
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు