తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు.
తురువోలులో ప్రసంగిస్తున్న సీఎం రమేశ్, పక్కన బండారు, రామానాయుడు తదితరులు
చీడికాడ, న్యూస్టుడే: గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. ఉప ముఖË్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ముత్యాలనాయకుడు రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. పేద రైతులను భయపెట్టి భూముల్ని కబ్జా చేశారన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనతోపాటు కుమార్తెనూ చిత్తుగా Ëఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. చీడికాడ మండలం చుక్కపల్లి, చెట్టుపల్లి, అర్జునగిరి, తురువోలు గ్రామాల్లో సోమవారం రాత్రి రోడ్షో నిర్వహించారు. ఉత్తరాంధ్ర వనరులను వైకాపా పెద్దలు దోచుకున్నారన్నారన్నారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తిని గెలిపిస్తే వైకాపా నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. అపారమైన సాగునీటి వనరులున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు, జనసేన అధ్యక్షుడు రాయపురెడ్డి కృష్ణ, సింహాచలంనాయుడు, రమణమ్మ, సన్యాసినాయుడు, ముసలినాయుడు, చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
దళితులంతా ఏకమవ్వాలి
జనసేనలో చేరిన వైకాపాకు చెందిన దళిత సంఘాల నాయకులతో సుందరపు, శ్రీవేణి
అచ్యుతాపురం, న్యూస్టుడే: దళిలంతా ఏకమై సీఎం జగన్ ఓడించి మళ్లీ హైదరాబాద్కు డోర్ డెలవరీ చేయాలని జనసేన ఎలమంచిలి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్కుమార్ పిలుపునిచ్చారు. మడుతూరుతోపాటు వివిధ గ్రామాలకు చెందిన వైకాపాకు చెందిన దళిత సంఘాల నాయకులు సోమవారం ఉమ్మడి జిల్లా జనసేన కార్యదర్శి మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో జనసేన గూటికి చేరారు. పార్టీలోకి చేరిన సంఘాల నాయకులకు ఆయన కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల ఓట్లుతో గెలిచిన జగన్ ఐదేళ్లలో దళితులను హత్యచేసిన వారిని ప్రోత్సహించడం, దళితుల భూముల్లో జగనన్న కాలనీలు ఏర్పాటుచేసి పరిహారం ఇవ్వకపోవడం, ఎస్సీల పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించి జైలుకు పంపించడం, డాక్టర్ సుధాకర్ చనిపోవడం వంటివి చేశారన్నారు. సంఘాల నాయకులు తట్టా శ్రీనివాసరావు, నడుపూరి హారతి, ప్రవీణ్, కొత్తపల్లి సన్యాసినాయుడు, మార్లపల్లి సుజాత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
ఓటింగులో వీరే ఆదర్శం
[ 16-05-2024]
రహదారి సౌకర్యంలేని మారుమూల గ్రామాల వారికి గో‘దారే‘ దిక్కుగా మారింది. శ్రీరామగిరి పంచాయతీ కల్తునూరు, తుమ్మిలేరు పోచవరం పంచాయతీ పరిధి కొల్లూరు, గొందూరు, తుమ్మిలేరు -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
అరకు పార్లమెంట్ పరిధిలో 73.68 పోలింగ్ నమోదు
[ 16-05-2024]
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 73.68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం వెల్లడించారు. -
కూటమికే అనుకూల ఫలితాలు
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా పాలనపై వ్యతిరేకత పెరిగింది అనడానికి సార్వత్రిక ఎన్నిల్లో పోలింగే నిదర్శనమని కూటమి పాడేరు శాసనసభ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
వరుస ప్రమాదాలతో బెంబేలు..
[ 16-05-2024]
జిల్లాలో జాతీయ రహదారితోపాటు గ్రామీణ రహదారులు వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం: పీలా
[ 16-05-2024]
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 80 వేలకు పైగా, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ 30 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. -
ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మన్యంలో తప్పని డోలి మోతలు
[ 16-05-2024]
మన్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో డోలి మోతలు తప్పడం లేదు. -
మన్యం ఓటర్లు పోటెత్తారు..!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జనం ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేశారు. నియోజకవర్గం పరిధిలో 63.91 శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం బుధవారం ప్రకటించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
విశాఖ జిల్లాలో 70.03 శాతం పోలింగ్
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM