logo

వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం

వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు.

Published : 30 Apr 2024 03:22 IST

మోతుగూడెంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి శిరీషాదేవి

మోతుగూడెం, న్యూస్‌టుడే: వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. వచ్చే ఎన్నికలో వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం ఆమె నాయకులు, కార్యకర్తలతో కలిసి చింతూరు మండలం మోతుగూడెం, వై.రామవరం మండలం బొడ్డగండి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి సైకిల్‌ గుర్తుపై తనకు, కమలం గుర్తుపై ఎంపీగా కొత్తపల్లి గీతకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో భాజపా, తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మోతుగూడెం, పొల్లూరు, ఫోర్‌బే, ఇంతులూరు వాగు, ఎంసీడీ, ఒడియా క్యాంపులు, డొంకరాయి, బొడ్డగండి పంచాయతీలోని గ్రామాల్లో భారీ బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. నాయకులు చిట్టిబాబు, ఎం.రాజు, వేగి నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని