వైకాపాది దుర్మార్గ పాలన
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు.
చింతపల్లి సభలో ప్రజలకు అభివాదం తెలియజేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి
కొయ్యూరు, చింతపల్లి, న్యూస్టుడే: వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. తెదేపా, భాజపా, జనసేన ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గీత, గిడ్డి ఈశ్వరిలకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చింతపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం గిరిజనులకు సంక్షేమ పథకాలు రద్దు చేసిందని గీత, గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ప్రత్యేక డీఎస్సీ ఊసే లేదన్నారు. వైకాపా దుర్మార్గ పాలనతో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచారన్నారు. చెత్తపై పన్నేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యంపైనే ఇరవై ఏళ్ల వరకు అప్పు చేశారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయిందని ఆరోపించారు. రాజేంద్రపాలెం పీహెచ్సీని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని, మహిళా జూనియర్, డిగ్రీ కళాశాలలో సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వసతిగృహాల్లో ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తామని పేర్కొన్నారు. జనసేన, భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జులు గంగులయ్య, కృష్ణారావులు వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జి.సత్యనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యులు నళిని, శ్రీరామ్మూర్తి, తెదేపా నేతలు డి.చిట్టిబాబు, బొర్రా నాగరాజు, విజయరాణి, చల్లంగి లక్ష్మణరావు, జ్ఞానేశ్వరి, పరిశీలకులు నారాయణ, మండల అధ్యక్షులు పూర్ణచంద్రరరావు, జనసేన నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. చీడిపాలెం మాజీ సర్పంచి, వైకాపా నేత లోతా జోగిరాజు తెదేపాలో చేరడంతో ఈశ్వరి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
ఓటింగులో వీరే ఆదర్శం
[ 16-05-2024]
రహదారి సౌకర్యంలేని మారుమూల గ్రామాల వారికి గో‘దారే‘ దిక్కుగా మారింది. శ్రీరామగిరి పంచాయతీ కల్తునూరు, తుమ్మిలేరు పోచవరం పంచాయతీ పరిధి కొల్లూరు, గొందూరు, తుమ్మిలేరు -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
అరకు పార్లమెంట్ పరిధిలో 73.68 పోలింగ్ నమోదు
[ 16-05-2024]
అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 73.68 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం వెల్లడించారు. -
కూటమికే అనుకూల ఫలితాలు
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా పాలనపై వ్యతిరేకత పెరిగింది అనడానికి సార్వత్రిక ఎన్నిల్లో పోలింగే నిదర్శనమని కూటమి పాడేరు శాసనసభ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. -
వరుస ప్రమాదాలతో బెంబేలు..
[ 16-05-2024]
జిల్లాలో జాతీయ రహదారితోపాటు గ్రామీణ రహదారులు వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం: పీలా
[ 16-05-2024]
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 80 వేలకు పైగా, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ 30 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. -
ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే రోడ్డు నిర్మాణం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మన్యంలో తప్పని డోలి మోతలు
[ 16-05-2024]
మన్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో డోలి మోతలు తప్పడం లేదు. -
మన్యం ఓటర్లు పోటెత్తారు..!
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జనం ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేశారు. నియోజకవర్గం పరిధిలో 63.91 శాతం నమోదైనట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం బుధవారం ప్రకటించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
విశాఖ జిల్లాలో 70.03 శాతం పోలింగ్
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్