అమ్మకు కష్టం.. అందని వైద్యం
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు.
పీహెచ్సీల్లో కాన్పులు ఏవీ?
కాగితాల్లోనే కార్పొరేట్ వైద్యం
పెడన, న్యూస్టుడే
వైద్యరంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చామని, గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందేలా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని వైకాపా ప్రభుత్వం చేస్తోన్న ప్రచారానికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కన్పించడం లేదు.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా వైద్యులు రోగుల ఇంటికి వెళ్లి సేవలు అందిస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నా గ్రామీణులు మాత్రం తమ వద్దకు వైద్యులు రావడం లేదని స్పష్టం చేస్తున్నారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు చేస్తున్నామని వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దామని చెబుతున్నా పీహెచ్సీల్లో నెలలో ఒక కాన్పు కూడా జరగడంలేదు.
అందుబాటులో ఉన్నా..
పెడన పట్టణంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉన్నా గర్భిణులు మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా వైద్యురాల్ని నియమించినా ఆమె ఉయ్యూరు నుంచి విధులకు రావాల్సి వస్తోంది. చేవేండ్రపాలెం పీహెచ్సీకి మహిళా వైద్యురాలిని నియమించినా ప్రసూతి సేవలు అందుబాటులోకి రాలేదు. ఫలితంగా గర్భిణుల్ని గుడివాడ, మచిలీపట్నం ఆస్పత్రులకు తీసుకువెళ్తున్నారు. గూడూరు మండలం మల్లవోలు పీహెచ్సీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక, లక్ష్మీపురం, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెదతుమ్మిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందక గర్భిణులు 50 కి.మీల దూరంలో ఉన్న భీమవరం, గుడివాడ, మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ముగ్గురు స్టాఫ్ నర్సులు ఎక్కడ?
పీహెచ్సీల్లో 24గంటల వైద్యసేవలు, కాన్పుల కోసం ముగ్గురు స్టాఫ్ నర్సులను నియమించామని చెబుతున్నా ఏ పీహెచ్సీలోనూ ముగ్గురు స్టాఫ్ నర్సులు కన్పించడం లేదు. పెడన అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి ఫార్మాసిస్ట్ను మచిలీపట్నం సెంట్రల్ డ్రగ్ స్టోర్కు డిప్యుటేషన్పై పంపించారు. ఫలితంగా విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సు రోగులకు మందులివ్వాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. పెడన పీహెచ్సీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముగ్గురు స్టాఫ్ నర్సులు లేక గర్భిణులకు ప్రసూతి సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నామమాత్రంగా పరీక్షలు
ప్రతి నెల 9వ తేదీన ప్రధాన మంత్రి మాతృత్వ సురక్ష యోజన కింద గర్భిణులకు ప్రభుత్వ ఆస్పతుల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. ఆ రోజు సంబంధిత మహిళా ఆరోగ్య కార్యదర్శులు, ఆశాలు గర్భిణులను ఆస్పత్రులకు తీసుకువస్తారు. ఆస్పత్రుల్లో మందుల కొరత, నిర్ధారణ పరీక్షలకు కిట్లు లేక అరకొర వైద్యసేవలు అందుతున్నాయి. ఫలితంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పూర్తిస్థాయిలో అందని సేవలు
- మట్టా నాగరాజు, పెడన
ఏ ఆస్పత్రిలోనూ పూర్తిస్థాయిలో ఆరోగ్య సేవలు అందడంలేదు. 24గంటలు వైద్యసేవలు అందించాల్సి ఉండగా అది అందని ద్రాక్షగా మారింది. గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి వెళితే అక్కడ పడకలు ఖాళీ ఉండవు. కొందరు సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా బదులిస్తారు. పెడనలో ప్రసూతి సేవలు అందవు. ఈఐదేళ్లలో వైద్యరంగం పూర్తిగా వెనుకంజ వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమిలో ఉత్సాహం.. వైకాపాలో నైరాశ్యం
[ 14-05-2024]
‘‘ఆనందోత్సాహాలు.. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో తెదేపా శ్రేణులు.. రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, -
పో‘రంకెలేసిన’ జోగి.. మంత్రి రెచ్చిపోయినా అడ్డుకోని పోలీసులు
[ 14-05-2024]
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. అధికార వైకాపా నాయకుల ఆగడాలను అడ్డుకోలేక చేతులెత్తేసింది. -
మండుటెండలో.. ఓట్ల వర్షం
[ 14-05-2024]
కృష్ణమ్మ జోరును తలపించిన జనాల హోరుతో పోలింగ్ కేంద్రాలు పోటెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఉదయం 6 గంటలకే ఓటర్లు భారీగా తరలివచ్చారు. -
ఐసీయూ నుంచి పోలింగ్ కేంద్రానికి..
[ 14-05-2024]
నగరానికి చెందిన గోవాడ వెంకటేశ్వరరావు (68) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. -
కవ్వింపులు.. ప్రలోభాలు
[ 14-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో వైకాపాకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల తీరుతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు, -
రెండో రోజూ తెదేపా ఏజెంట్లపై వైకాపా దాడి
[ 14-05-2024]
తెదేపా ఏజెంట్లుగా వ్యహరించిన ఇరువురిపై వైకాపా వర్గీయులు మూకుమ్మడి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. -
ఉయ్యూరులో అధికార పార్టీ నేత బరితెగింపు
[ 14-05-2024]
కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైకాపా నేత, సీడీసీ ఛైర్మన్ రామచంద్రరావు బరితెగించి ఏకంగా సీఐడీ డీఎస్పీ సోమయ్యపై దూసుకెళ్లి దాడికి యత్నించారు. -
బందరులో 11.30 వరకు సాగిన పోలింగ్
[ 14-05-2024]
ఈవీఎంల మొరాయింపు కారణంగా తలెత్తిన సమస్యలతో వివిధ కేంద్రాల్లో రాత్రి 11.30 గంటలవరకు పోలింగ్ కొనసాగింది. బందరు నగరంలోని గొడుగుపేట పాఠశాలలోని 144వ బూత్తోపాటు గాంధీవిద్యాలయం -
మేము సైతం ..
[ 14-05-2024]
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ముఖ్యులు సోమవారం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా జడ్జి అరుణ సారిక శిశువిద్యా మందిరంలోని 75వ బూత్లో ఓటు వేశారు. -
జడ్పీ ఛైర్పర్సన్కు ప్రతిఘటన
[ 14-05-2024]
స్థానిక బంగ్లాస్కూలు పోలింగు కేంద్రంలోకి వచ్చిన జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికను తెదేపా నేతలు అడ్డుకున్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే లోనికి రావాలని మీరు ఏ హోదాలో వస్తున్నారంటూ ఆమెను ప్రశ్నించారు. -
పెద్దోళ్లూ.. మీరు గొప్పోళ్లు
[ 14-05-2024]
వయసుమీద పడింది. శరీరం సహకరించకుంది. అవయవాలు ఇబ్బంది పెడుతున్నా.. ఓటు హక్కు వినియోగంలో ఉత్సాహం తగ్గలేదు. లైన్లలో నిలబడలేక ఓటు వేయడమే మానేస్తున్నవారిలో స్ఫూర్తినింపేలా.. -
వైకాపా నేతల బరితెగింపు
[ 14-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వైకాపా నేతలు బరితెగించారు. ఆదివారం 59వ డివిజన్లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద డబ్బులు పంచుతుండగా.. -
భవానీపురం సీఐపై వేటు
[ 14-05-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహించిన భవానీపురం పోలీస్స్టేషన్ సీఐ వి.కృష్ణపై వేటు పడింది. సీఐని వీఆర్కు పంపుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
వైకాపా సోషల్ మీడియా బ్యాచ్ హడావిడి
[ 14-05-2024]
పాతబస్తీ రాయల్ ఫంక్షన్ హాల్లో సుమారు 30 మందికి పైగా బయట వ్యక్తులు(పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కాదు) 18ల్యాప్ ట్యాప్లతో ఏదో పని చేస్తున్నారని స్థానిక ప్రజలు ఎన్డీయే నేతలకు సమాచారం ఇచ్చారు.