logo

తెదేపాను గెలిపించాలని ఘంటసాలలో ఎన్నారైల ఎన్నికల ప్రచారం

అవనిగడ్డ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాథ బాబు, మూల్పూరి వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 29 Apr 2024 20:56 IST

ఘంటసాల: అవనిగడ్డ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాథ బాబు, మూల్పూరి వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఉమ్మడి అభ్యర్థులకు చెందిన గాజు గ్లాసు గుర్తు గల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నారైలు రంగనాథ బాబు, వెంకట్రావు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకుడు యార్ల శ్రీకాంత్, మాజీ ఉప సర్పంచి స్వరాజ్యలక్ష్మి, తెదేపా నాయకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, బండి పరాత్పరరావు, గొర్రెపాటి సురేష్, కాకుమాని రంగారావు,  గొర్రెపాటి శ్రీనివాసరావు, కొమ్ము సుందరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని