వైకాపా నాయకుడి బరితెగింపు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుంది అధికార వైకాపా నాయకుల తీరు. పార్టీ పెద్దలు పంచభూతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటే.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తామేం తక్కువన్నట్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమించి మామిడి సాగు
ప్రభుత్వ భూమి ఆక్రమించి నాటిన మామిడి చెట్లు
కదిరి పట్టణం, తనకల్లు, న్యూస్టుడే: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుంది అధికార వైకాపా నాయకుల తీరు. పార్టీ పెద్దలు పంచభూతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటే.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తామేం తక్కువన్నట్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు. కదిరి నియోజకవర్గం, తనకల్లు మండలంలోని సీజీ ప్రాజెక్టు గ్రామానికి చెందిన వైకాపా గ్రామస్థాయి నాయకుడు ఏకంగా రెండెకరాల భూమిని ఆక్రమించుకుని దర్జాగా 110 మామిడిచెట్లు నాటేశాడు. ఈ విషయాన్ని స్థానికులు ఫిర్యాదు చేసినా.. వైకాపా నాయకుల హెచ్చరికలతో రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోయారు. కోటపల్లి రెవెన్యూ గ్రామం సర్వేనంబరు 85లో 44.74 ఎకరాల భూమి వాగు పరివాహక ప్రాంతంగా రికార్డులో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి వాగుగా ఉంది. మహమ్మదాబాద్ క్రాస్ నుంచి కొక్కంటిక్రాస్ వరకు రోడ్డు వేస్తున్న సమయంలో అధికారపార్టీ నాయకుల ఆదేశాలతో గుత్తేదారు వాగు పరివాహక ప్రాంతంలోని మట్టిని ఇష్టానుసారం తవ్వేశారు. మట్టి తరలింపు, భూమి స్వభావంపై రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. మట్టి తవ్వేయడంతో రెండు ఎకరాలకు పైగా భూమి చదునుగా మారింది. దీన్ని గమనించిన సీజీ ప్రాజెక్టుకు చెందిన వైకాపా గ్రామస్థాయి నాయకుడు సాగుకు అనుకూలంగా మార్చేసుకుని మామిడిచెట్లు నాటాడు. అంతేకాదు.. వాటికి నీరందించేందుకు చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు నుంచి అక్రమంగా పైపులు ఏర్పాటు చేసుకుని నీటి చౌర్యానికి పాల్పడుతున్నాడు. స్థానికులు ఫిర్యాదు చేసినా నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సదరు నాయకుడు ఆక్రమించిన భూమి ఎకరా రూ.40 లక్షలు పలుకుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూరీసర్వేలో జగన్మాయ
[ 11-05-2024]
‘శాశ్వత భూ హక్కు-భూ సంరక్షణ’ పథకంలో అంతా జగన్మాయే.. వైకాపా సర్కారు తీసుకొచ్చిన భూరీ సర్వేలోనూ మాయాజాలమే. దేశ చరిత్రలోనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి... భూ యజమానులకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామంటూ మాయ మాటలతో దగా చేసింది. -
పీఏబీఆర్ లింకు కాలువ ఆధునికీకరణపై నిర్లక్ష్యం
[ 11-05-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకు పీఏబీఆర్ గుండెకాయ లాంటిది. అనంతపురం నగరపాలక సంస్థతోపాటు నాలుగు మున్సిపాలిటీలకు, దాదాపు వెయ్యి గ్రామాలకు ఇక్కడి నుంచే తాగునీరు సరఫరా అవుతున్నాయి. -
జగనన్న కాలనీల్లో వైకాపా ‘భూ’చోళ్లు
[ 11-05-2024]
ఓవైపు సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలంతా తననే నమ్మాలని చెబుతుంటే.. మరోవైపు ఆయన పార్టీ నాయకులు మాత్రం పేదల భవిష్యత్తును అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పేదల కోసం ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లోని ఖాళీ స్థలాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. -
జగన్ గొప్పలు.. రైతులకు తిప్పలు
[ 11-05-2024]
జిల్లేడుబండ జలాశయ ముంపు గ్రామాల పరిహారంలో జగన్ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణంతో వేల ఎకరాల భూములు సాగులోకి తీసుకొస్తామని గొప్పలు చెప్పుకొనే జగన్ జలాశయ నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. -
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపండి
[ 11-05-2024]
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఉరవకొండలోని డ్రైవర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. -
తెదేపా గెలుపునకు యువత కసితో పని చేయాలి: కాలవ
[ 11-05-2024]
తెదేపా గెలుపునకు యువత కసి, పట్టుదలతో శ్రమించాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టణ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో కాలవ మాట్లాడారు. -
శృతి మించుతున్న వైకాపా ఆగడాలు: పరిటాల సునీత
[ 11-05-2024]
ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి : ఐదేళ్ల వైకాపా దుష్టపాలనకు ముగింపు పలుకుదామని అందుకు ప్రజలంతా అండగా నిలవాలని రాప్తాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. -
దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం
[ 11-05-2024]
అడుగడుగునా దోపిడీకి పాల్పడుతూ, ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న వైకాపా ప్రభుత్వాన్ని ఓటుతో తరిమి కొడదామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
ముస్లింల సంక్షేమం తెదేపాతోనే సాధ్యం
[ 11-05-2024]
ముస్లింల సంక్షేమం, అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన ఉరవకొండలోని ఆయా మసీదుల్లో ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
తెదేపాలోకి వైకాపా నాయకుల చేరిక
[ 11-05-2024]
మండలంలోని దురదకుంట గ్రామంలో వైకాపాకు చెందిన 13 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. శుక్రవారం అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
అక్రమార్జనకు అద్దె ట్రాక్టర్లు
[ 11-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికార పార్టీ నాయకుల అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుంది పుట్టపర్తిలో పరిస్థితి. -
జనసేన నాయకులపై వైకాపా వర్గీయుల దాడి
[ 11-05-2024]
పుట్టపర్తితో వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం పట్టణంలోని చిత్రావతిగుట్ట 7, 8 వార్డుల్లో వైకాపా నాయకులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా తెదేపా నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. -
ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని ఓ ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. క్షేత్రస్థాయిలో తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆ పార్టీ నాయకులు డబ్బులిచ్చి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
వైకాపాతో అంటకాగిన ఉద్యోగులపై ఫిర్యాదులు
[ 11-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కొందరు ఉద్యోగులు వైకాపా కార్యకర్తలుగా పని చేస్తున్నారు. వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ పలువురి ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
88 శాతం పోస్టల్ బ్యాలెట్
[ 11-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు స్ఫూర్తిని చాటారు. ఎన్నడూ లేనంతగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈస్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
తాజా వార్తలు (Latest News)
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు