పొడిబారిన దారులు
తిరుపతి కరకంబాడి మార్గంలో భూపాల్ లేఔట్ సమీపంలో నాలుగు నెలల కిందట సిమెంట్ రోడ్డు నిర్మించారు. కొద్ది రోజులకు కురిసిన వర్షాలకు పొరలు పొరలుగా లేస్తోంది.
తిరునగరిలో ఇసుక రహిత సిమెంట్ రోడ్ల నిర్మాణం
న్యూస్టుడే, తిరుపతి (నగరపాలిక)
తిరుపతి కరకంబాడి మార్గంలో భూపాల్ లేఔట్ సమీపంలో నాలుగు నెలల కిందట సిమెంట్ రోడ్డు నిర్మించారు. కొద్ది రోజులకు కురిసిన వర్షాలకు పొరలు పొరలుగా లేస్తోంది. తమ విజ్ఞప్తి మేరకే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో రోడ్డు దుస్థితిపై ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేయలేకపోతున్నారు.
.. ఈ ఒక్క రోడ్డే కాదు.. నగరంలో ఎమ్మార్పల్లి, జీవకోన, లక్ష్మీపురం పరిసర ప్రాంతం, యశోదనగర్, యాదవకాలనీ, భవానీ నగర్ తదితర ప్రాంతాల్లో వేసిన రోడ్లన్నీ కొద్దినెలలకే దెబ్బతిన్నాయి.
కరకంబాడి రోడ్డులో నిర్మాణానికి నిల్వ చేసిన రాతిపొడి
నగరపాలిక సాధారణ నిధుల నుంచి కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.61 కోట్లు మంజూరు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొన్ని పనులు పూర్తి కాగా.. మరికొన్ని సాగుతున్నాయి. కొన్నింటికీ ఇంకా టెండర్లు పిలవలేదు. ఇప్పటి వరకు చేసిన పనులు, ప్రస్తుతం చేస్తున్న పనుల్లో నాణ్యతకు పాతర వేస్తున్నారు.
ఎలా ఏమార్చుతున్నారంటే..
సిమెంట్ రోడ్లు, మురుగునీటి, వర్షపునీటి కాలువలు, వంతెల నిర్మాణ సమయంలో ఇసుక, కంకర, సిమెంట్ కలిపిన కాంక్రీట్ను వాడాలి. ఇసుక ధర ఎక్కువగా ఉండటంతో గుత్తేదారులకు గిట్టుబాటు కాదనే సానుభూతితో 50 శాతం వరకు రాతి పొడిని వాడేందుకు అనుమతిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో లభించే రాతిపొడి సైతం నున్నగా ఉండటంతో ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి పొడి గరుకుగా ఉంటేనే అనుమతించేలా నిబంధనలు విధించారు. దీనిని ఆసరాగా చేసుకుని గుత్తేదారులు పూర్తిగా రాతి పొడిని వినియోగించి కాంక్రీటు పనులు చేస్తున్నారు. ప్రజల్ని ఏమార్చేందుకు పనులు జరిగే ప్రాంతంలో కొద్ది పరిమాణంలో ఇసుకను నిల్వ చేసుకుని నగరపాలిక అధికారులు, సిబ్బంది కాకుండా ఇతరులెవరైనా వస్తే కొద్దిగా ఇసుక చల్లి కాంక్రీటు కలుపుతున్నారు. లేదంటే యథావిధిగా రాతిపొడి కాంక్రీటు కుమ్మరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
గొల్లవానిగుంటలోరహదారి దుస్థితి
గుత్తేదారులదే రాజ్యం
నగరపాలిక సాధారణ నిధులతో చిన్నచిన్న పనులుగా విభజించి చేస్తున్న ఈ నిర్మాణాలకు అధికారులు అభ్యంతరాలు లేకుండా బిల్లులు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికితోడు గుత్తేదారులను ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. పనులు అప్పగించడం, పూర్తయిన తరువాత బిల్లులు మంజూరు చేయడం వరకే అధికారులు పరిమితమయ్యారు.
* ఈ విషయమై నగరపాలిక ఏసీఈ మోహన్ను వివరణ కోరగా.. పనులను ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలించి ఇసుకను కచ్చితంగా వాడేలా ఆదేశిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుత్తూరులో నిర్వహించిన సభకు జనాలు అంతంతమాత్రంగానే వచ్చారు. వచ్చిన జనాలు సైతం జగన్ ప్రసంగాన్ని వినేందుకు ఇష్టపడలేదు. -
చంద్రబాబు శ్రీకారం.. జగన్ నిర్వీర్యం
[ 11-05-2024]
ప్రజాప్రయోజనాల కోసం గత తెదేపా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసింది.. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది.. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత: కలెక్టర్
[ 11-05-2024]
సమస్యాత్మిక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నామని; ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ రాజకీయ పార్టీల అభ్యర్థులకు సూచించారు. -
బాబు సూపర్-6 పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
[ 11-05-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లింది. కూటమి అధికారంలోకి వస్తే అజెండాలో ప్రకటించిన పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. -
దోచుకున్న సొమ్మేగా.. కొనేద్దాం..!
[ 11-05-2024]
అధికారాన్ని కాపాడుకునేందుకు వైకాపా పడరాని పాట్లు పడుతోంది. తమ అభ్యర్థులు పేదలు, సామాన్యులు.. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూనే.. -
తెదేపాకు అనుకూలమా.. ఆపేయ్..!
[ 11-05-2024]
పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి విషయంలో అంతా సమానంగా ఉండాలి.. కానీ వైకాపాకు మాత్రం ఈ సిద్ధాంతం వర్తించదేమో అనిపించేలా పాలన సాగించారు.. -
ప్రలోభాలు ప్రారంభం.. ఇంటింటికీ కోడి మాంసం.. మద్యం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. -
కదిలింది.. తెలుగు మహిళా లోకం
[ 11-05-2024]
తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు చిత్తూరులో శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. -
నోటుకు లేదు ఢోకా.. మందుచుక్కే కరవైంది
[ 11-05-2024]
‘ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉద్యోగం కోసం సిఫార్సు లేఖ ఇచ్చింది నేనే కదా.. ఎన్నికల సమయంలో వీలైనంతగా సరకు పంపించే బాధ్యత నీకు లేదా.. -
వైకాపా సర్పంచికి మహిళల దేహశుద్ధి
[ 11-05-2024]
వైకాపా సర్పంచికి మహిళలు దేహశుద్ధి చేశారు. కుప్పం మండలం యమనాసనపల్లిలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా సర్పంచి సురేష్ ఓటర్లకు నగదు పంచేందుకు వచ్చారు. -
నాయకుల బైండోవర్లు దారుణం
[ 11-05-2024]
గత ఆరు నెలల్లో జిల్లాలో తెదేపా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు వాపోయారు.