logo

సీఎం వస్తున్నారని హడావుడి పనులు

త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్‌రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.

Published : 28 Apr 2024 02:41 IST

జనార్దన్‌రెడ్డి విగ్రహం వద్ద కాలువపై బండ వేస్తున్న కార్మికులు

వెంకటగిరి: త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్‌రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది. పురపాలిక అధికారులు హుటాహుటిన కాలువపై సిమెంట్‌తో బండపోశారు. మరోవైపు ఉన్న కాలువ, రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నా మరమ్మతు చేయలేదు. కేవలం ఓ మార్గంలోనే సీఎం వస్తుండడంతో ఈ ప్రాంతంలో బాగు చేశారు. కాగా.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హెలిపాడ్‌ సిద్ధం చేశారు. ఆదివారం ప్రత్యేక వాహనంలో సీఎం త్రిభువని చేరుకుంటారు. బస్సులో నుంచి ప్రసంగిస్తారు. పోలీసులు శనివారం వాహనాల ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. దుకాణాలు మూసేయాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని