logo

ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్‌ తెలిపారు.

Published : 30 Apr 2024 02:39 IST

వైకాపా ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు (వృత్తాల్లోని వారు)

వెదురుకుప్పం, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్‌ తెలిపారు. సోమవారం మండల పరిధి నల్లవెంగనపల్లె పంచాయతీలో జరిగిన వైకాపా నేతలల ఎన్నికల ప్రచారంలో ఇద్దరు వాలంటీర్లు రమేష్‌, రాజేంద్ర పాల్గొన్నట్లుగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని చెప్పారు. అదే పంచాయతీకి చెందిన ఇద్దరు వాలంటీర్లు ప్రకాష్‌(క్లస్టర్‌ నెం-13), సింధూజ(క్లస్టర్‌ నెం-19) స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు అందించారని, వారిని విధుల నుంచి తొలగించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని