logo

ఆలయంలో అధికార పార్టీ ప్రచారం

పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేపట్టారు.

Published : 30 Apr 2024 02:42 IST

బజారువీధి రామ మందిరంలో బంగారు వ్యాపారులతో మాట్లాడుతున్న వైకాపా అభ్యర్థి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేపట్టారు. స్థానిక బంగారు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రామమందిరంలో సమావేశం నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్‌ ఢిల్లీబాబు, నేతలు వెంకటేశ్వరరావు, బ్రహ్మయ్య,రామారావు, బంగారు వ్యాపారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని