పింఛను పంచన.. నయా వంచన
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు.
వృద్ధులపై వైకాపా ప్రభుత్వ కక్ష
సచివాలయాల కంటే బ్యాంకులే దూరం
ఖాతాల్లో వేస్తామంటూ లబ్ధిదారులతో చెలగాటం
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసి వృద్ధులను మూడు-నాలుగు కిలోమీటర్లు నడిపించిన ఉదంతం తెలిసిందే. ఇది మరువక ముందే మే నెల పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అక్కడకే వెళ్లి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నడి ఎండలో వృద్ధులు అంతదూరం ఎలా వెళ్లగలరనే ప్రశ్నలు వస్తున్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వైకాపా సర్కార్ వ్యవహరిస్తోంది. సచివాలయాల్లో సరిపడా సిబ్బంది ఉన్నా ఇలా చేయడమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
ఈనాడు, చిత్తూరు- న్యూస్టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ): జిల్లాలోని సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్నా గత నెలలోలాగా యాతనకు గురిచేసేందుకు జగన్ ప్రభుత్వం చూడటం దారుణమని లబ్ధిదారులు వాపోతున్నారు. గత నెల ఎండలకు ఇబ్బందిపడ్డారని.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై వేసిన ప్రభుత్వం.. గతంలో కంటే మూడు నాలుగు రెట్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఎలా తీసుకోవాలని ఉత్తర్వులు ఎలా ఇస్తారని పింఛనుదారులు ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్లు ఇప్పించడానికి అవకాశమున్నా.. తమను అవస్థల పాల్జేసి రాజకీయ లబ్ధి పొందడమే ధ్యేయంగా వైకాపా సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.
రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశమున్నా..
ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయ సిబ్బందికి పెద్దగా పనులు అప్పగించలేదు. వీరికి ఈ బాధ్యత అప్పగిస్తే ఒక్కో సిబ్బంది 31 మందికి నగదు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందరికీ కలిపి కనిష్ఠంగా ఒక్క రోజు.. గరిష్ఠంగా రెండు రోజుల్లో నగదు ఇవ్వవచ్చు. ఈ మేరకు ఆదేశిస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు, వృద్ధుల నుంచి సీఎస్ జవహర్రెడ్డికి డిమాండ్లు వచ్చినా బేఖాతరు చేశారు.
గుడుపల్లెలో బ్యాంకులు రెండు.. పింఛనర్లు 4,060 మంది
గుడుపల్లె మండలంలో రెండు బ్యాంకులున్నాయి. ఇవి రెండూ పీఈఎస్ కళాశాల, ద్రవిడ విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది సేవలు అందించడానికే కష్టంగా ఉంటోంది. మండలంలోని 4,060 మంది పింఛనుదారులు ఇక్కడ క్యూ కట్టే అవకాశం ఉంది. 8 కి.మీ. దూరంలోని పెద్దపర్తికుంట నుంచి వృద్ధులు వచ్చి పింఛను తీసుకోవడం కష్టమే.
ఖాతాదారులకే కష్టాలు..
కల్లూరు ఇండియన్ బ్యాంకులో సిబ్బంది కొరతతో ఖాతాదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి. ఇక పింఛను లబ్ధిదారులు వస్తే అక్కడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
- పాలసముద్రంలోనూ ఒకే బ్యాంకు శాఖ ఉండగా 2,833 మంది పింఛనుదారులున్నారు. ఒకేరోజు ఎండలో ఇంతమంది బ్యాంకు వద్దకు నడుచుకుంటూ, వాహనాల్లో రాగలరా? వచ్చినా అక్కడ సదుపాయాలు లేవని తెలిసినా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు.
- పూతలపట్టు నియోజకవర్గంలో 31,060 మంది బ్యాంకులకు వచ్చి పించను తీసుకోవాలి. ఇక్కడ 40 బ్యాంకు శాఖలే ఉన్నాయి. ఐరాల మండలంలోని 12 బ్యాంకులలో సగం కాణిపాకంలోనే ఏర్పాటు చేశారు. ఇందులో దేవస్థాన లావాదేవీలే అధికంగా జరుగుతాయి.
- గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని 26 బ్యాంకుల నుంచి 31,058 మంది పెన్షన్ నగదు ఉపసంహరించుకోవాలి. ఇది ఆచరణలో కష్టం.
- నిండ్ర మండలం ఇరుగువాయి పంచాయతీ నుంచి బ్యాంకులకు చేరుకోవాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నిండ్ర లేదా నగరికి వెళ్లాలి. యాదమరి, పుంగనూరు మండలంలోని పలు గ్రామాలకు బ్యాంకులు 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జిల్లాలో ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి.
నా పేరు లక్ష్మమ్మ. గుడుపల్లె మండలం ఇరిసిగానిపల్లి. వితంతు పింఛను వస్తోంది. కుప్పం పట్టణంలోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. మా ఊరి నుంచి కుప్పానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇరిసిగానిపల్లి నుంచి గుడుపల్లె మండల కేంద్రానికి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. అక్కడి నుంచి కుప్పం పట్టణానికి బస్సు లేదంటే ఆటోలో ప్రయాణించాలి. రానుపోనూ ఛార్జీ రూ.40. భోజన, ఇతర ఖర్చులు కలిపి రూ.150 వరకు అవుతుంది. మొత్తంగా రూ.200 వరకు వెచ్చించాలి. అదీ వెళ్లిన రోజే పింఛన్ ఇస్తేనే. ప్రభుత్వం స్పందించి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు ఇవ్వాలి.
ఇబ్బంది పడతాం
ఈ నెలలో ఎండల్లో సచివాలయానికి వెళ్తే డబ్బులు రాలేదు. రేపు రావాలని చెప్పారు. మరుసటి రోజు వెళ్లి మధ్యాహ్నం వరకూ ఉండి పింఛను తెచ్చుకున్నాం. ఎండల్లో చాలా ఇబ్బంది కలిగింది. కాలికి దెబ్బ తగిలి నడవలేను. గతంలోలా ఇంటి వద్దే ఇవ్వాలి. మరోసారి ఇబ్బంది తప్పదు.
రాజమ్మ, ఎల్.బి.పురం, చిత్తూరు గ్రామీణ
గ్రామంలోనే ఇవ్వాలి
సచివాలయాల్లో పింఛను ఇచ్చినా, బ్యాంకు ఖాతాలకు జమ చేసినా వెళ్లి లైన్లో నిలుచుని తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడాలి. కనీసం ఇంటి వద్ద కాకున్నా గతంలోలా గ్రామంలో ఒకచోట ఇచ్చినా వెళ్లి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండదు.
కళావతి, వేపనపల్లి, పూతలపట్టు
నెలకో విధానం దారుణం
పింఛను పంపిణీకి నెలకో విధానం అమలు చేస్తే వృద్ధులు, దివ్యాంగులు అయోమయానికి గురై ఇబ్బంది పడతారు. ఇస్తే ఇంటి వద్ద లేకుంటే గ్రామంలోనే ఒక చోట పంపిణీ చేస్తే సమయానికి వెళ్లి పింఛను తెచ్చుకుంటాం.
వెంకటముని, దివ్యాంగుడు, రెడ్లపల్లి, శాంతిపురం
జిల్లాలో బ్యాంకులు: 244
మొత్తం పింఛన్లు : 2,72,864
బ్యాంకు ఖాతా లేనివారు: 80,843
జిల్లాలో సచివాలయాలు: 612
సచివాలయ సిబ్బంది: 8,800
ఒక్కొక్కరు పంపిణీ చేసే అవకాశమున్న పింఛన్లు: 31
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. ప్రధాన నిందితులు అరెస్ట్
[ 16-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. -
వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
[ 16-05-2024]
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. -
బైరాగి వేషం.. గంగమ్మ దర్శనం
[ 16-05-2024]
గంగమ్మ జాతరలో భక్తుల సందడి మొదలైంది. మొదటి రోజున బుధవారం బైరాగి వేషంలో చిన్నారులు అలరించారు. -
అవినీతి రారాజు.. మండలానికో సామంత రాజు
[ 16-05-2024]
అనగనగా ప్రసిద్ధి గాంచిన చంద్రగిరి కోట. ఆ కోటను ఐదేళ్లుగా అవినీతి, దోపిడీ రారాజు పరిపాలిస్తున్నారు. ఆయన రాజ్యంలోని బంట్లు రారాజును ఆదర్శంగా తీసుకున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రైవేటు భూముల కబ్జాలు, సెటిల్మెంట్లను అక్రమ సోపానాలుగా మలుచుకున్నారు. -
వైకాపా నేతలా.. వదిలేయి..!
[ 16-05-2024]
నేరానికి పాల్పడిన వ్యక్తుల కంటే అందుకు కారకులైన వారే ప్రధాన నిందితులు.. ఇదీ శిక్షణ సందర్భంగా పోలీసులకు చెప్పే తొలి పాఠం.. జిల్లా పోలీసులు మాత్రం ఈ సూత్రాన్ని పూర్తిగా విస్మరించారు. -
నాని ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎస్వీయూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం వైకాపా నేత భానుకుమార్రెడ్డి, నడవలూరు సర్పంచి గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై కేసు పెట్టారు. -
జలకళ నిలిపి.. చుక్కలు చూపి..
[ 16-05-2024]
పెద్దపంజాణి మండలం చలమంగళానికి చెందిన రైతు నాగరాజుకు మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో వేసిన బోరులో వచ్చే నీరు పశుగ్రాసం, వేరుసెనగ సాగుకు కూడా సరిపోయేది కాదు. బోరు నుంచి నీళ్లు నిలిచిపోవడంతో పంట వదిలేశారు. -
గ్రామాల్లో అందని ద్రాక్షగా వైద్యం!
[ 16-05-2024]
నిరుపేదలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. పల్లె ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్యసేవలు అందించి ప్రాణాపాయ పరిస్థితి -
ఇదీ లెక్క.. గెలుపు మాదే పక్కా
[ 16-05-2024]
ఓటరు నాడి పట్టుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక.. నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ వివరాలు స్పష్టమయ్యాయి. -
ఆవిరైన ఏపీ సీడ్స్.. ఆశలు
[ 16-05-2024]
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) ఆశించిన మేరకు విత్తన సేకరణ చేపట్టలేకపోయింది. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన వరి వంగడాలు అందుబాటులోకి తెచ్చే దిశగా విత్తన సేకరణకు శ్రీకారం చుట్టింది. -
స్ట్రాంగ్రూంలకు మూడంచెల భద్రత
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగియగా.. ప్రధాన ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఉంది. అందులో భాగంగా ఈవీఎం బాక్సుల భద్రతకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ మణికంఠచందోలు తెలిపారు. -
నిఘా నేత్రాలే లేకుంటే అంతే!
[ 16-05-2024]
కట్టుదిట్ట భద్రత కల్పించిన శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ల వద్ద మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోద్బలంతో వైకాపా మూకలు తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనను నిఘా నేత్రాలే బహిర్గతం చేశాయి. -
ఎన్నికల హడావుడిలో అధికారులు..
[ 16-05-2024]
ఎన్నికల హడావుడిలో అధికారులు ఉంటే.. వ్యాపారులు తమ పని చేసుకుపోతున్నారు. తమిళనాడు బియ్యం మన రాష్ట్రానికి.. మన రాష్ట్రం బియ్యం కర్ణాటకకు.. -
ఖర్చెంతో చెప్పండి
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలా అని పోటీచేసిన అభ్యర్థులు రిలాక్స్ అయిపోదామంటే కుదరదు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు ఎన్నికల ఖర్చును -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
బంగారుపాళ్యం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. -
స్విమ్స్ నుంచి ఇంటికి పులివర్తి నాని
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్విమ్స్ నుంచి బుధవారం డిశ్ఛార్జి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్